Pastor Praveen : లారీ కింద పడి.. పాస్టర్ ప్రవీణ్ కేసులో షాకింగ్ సీసీ ఫుటేజ్!

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ప్రవీణ్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో షాకింగ్ సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.  చిల్లకల్ల టోల్ ప్లాజా వద్ద బైక్ పై నుంచి ప్రవీణ్ కింద పడ్డారు. తృటిలో లారీ టైర్ల కింద పడే ప్రమాదాన్ని ఆయన తప్పించుకున్నారు.

New Update

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో షాకింగ్ సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.  చిల్లకల్ల టోల్ ప్లాజా వద్ద బైక్ పై నుంచి ప్రవీణ్ కింద పడ్డారు. మార్చి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తృటిలో లారీ టైర్ల కింద పడే ప్రమాదాన్ని ఆయన తప్పించుకున్నారు. ఆ సమయంలో వెనుక ఓ బస్సు కూడా వచ్చింది.  ఆ బస్సు డ్రైవర్ వెంటనే రైట్ తీసుకోవడంతో ప్రవీణ్ కు పెద్ద ప్రమాదం తప్పింది.  వెంటనే కింద పడిన ప్రవీణ్ ను స్థానికులు పైకి లేపి కూర్చొబెట్టారు.  ఆ తరువాత కాసేపటికే బైక్ తీసుకుని రాజమండ్రి వైపు తన ప్రయాణాన్ని కొనసాగించారు ప్రవీణ్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. 

Also read :  Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసుల బిగ్ ట్విస్ట్.. ఒకరు అరెస్ట్!

509 గజాల ల్యాండ్ కొనుగోలు

2025 మార్చి 24వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి తన బైక్ పై బయలుదేరారు పాస్టర్ ప్రవీణ్. ఆయన రాజమండ్రికి ఎందుకు వెళ్లారనేదానిపై ఆర్టీవీ చేసిన ఇన్వేస్టిగేషన్ లో కీలక విషయాలు బయటపడ్డాయి.  రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పాస్టర్ ప్రవీణ్ ఇటీవల 509 గజాల ల్యాండ్ కొనుగోలు చేశారు. ఈ ల్యాండ్ ను ఆయన కుమార్తె రిషిక, మేనల్లుడు రాజేష్ లపై కొనుగోలు చేశారు.  మార్చి 12న ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది. ప్రవీణ్ రాజమండ్రికి వచ్చే విషయం తన భార్యతో పాటుగా ఆకాష్, జాన్ లకు మాత్రమే తెలుసు.  ఓ సేవ స్వంస్థతో పాటుగా అనాధ పిల్లల కోసం హాస్టల్ నిర్మించాలని ప్రవీణ్ ఈ 509 గజాల ల్యాండ్ కొనుగోలు చేసినట్లుగా తెలిసింది.  

Also read :  Teacher crime: ముద్దులు పెడుతూ డబ్బులు వసూలు.. లేడీ టీచర్ అరాచకాలు!

Also read : Ameenpur : కలిపిన గెట్ టు గెదర్.. చిగురించిన అక్రమ సంబంధం.. సంసారం నాశనం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ram Charan vs. Allu Arjun : పెద్ది సినిమా అప్డేట్…రాంచరణ్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ రచ్చరచ్చ

గత కొంతకాలంగా మెగాఫ్యామిలీకి, బన్ని ఫ్యాన్స్‌ కి మధ్య జరుగుతున్న రచ్చ తెలిసిందే. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మొదలైన వివాదం బన్ని పుష్ప-2 విడుదల, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పైన కూడా ప్రభావం చూపింది.తాజాగా మరోసారి వివాదం తెరమీదకు వచ్చింది.

New Update
Ram Charan vs. Allu Arjun

Ram Charan vs. Allu Arjun

Ram Charan vs. Allu Arjun: గత కొంతకాలంగా మెగాఫ్యామిలీకి, బన్ని ఫ్యాన్స్‌ కి మధ్య జరుగుతున్న రచ్చ తెలిసిందే. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మొదలైన వివాదం బన్ని పుష్ప-2 విడుదల, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పైన కూడా ప్రభావం చూపింది.తాజాగా మరోసారి వివాదం తెరమీదకు వచ్చింది. అయితే ఇద్దరు హీరోల మధ్య ఎలాంటి వివాదాలు లేకపోయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం తగ్గడం లేదు. నిజానికి నటులు ఏనాడు నేరుగా గొడవపడింది లేదు. ఇద్దరు ఎలాంటి గొడవలు పడడం లేదు కానీ.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్... పెద్ద గొడవే పెట్టుకుంటున్నారు. వాస్తవంగా ఇవాళ శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో...హీరో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా నుంచి అప్డేట్ వదిలింది చిత్ర బృందం. ఈ పెద్ది సినిమా ఫస్ట్ షాట్ అంటూ ఓ గ్లింప్స్ వీడియోను చిత్ర బృందం రిలీజ్ చేసింది. 
 Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

దీంతో ఇవాళ ఉదయం నుంచి... సోషల్ మీడియాలో పెద్ది సినిమాకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఈ దెబ్బకు వెంటనే అలర్ట్ అయిన అల్లు అర్జున్ అభిమానులు...రామ్ చరణ్ ఫ్యాన్స్ పై యుద్ధమే ప్రకటించారు. AA22 పేరుతో కొత్తగా హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి... సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు. అల్లు అర్జున్ అలాగే అట్లీ కాంబినేషన్ లో అతి త్వరలోనే సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. దీనిపై ఏప్రిల్ 8వ తేదీన.. అల్లు అర్జున్ బర్త్..డే ఉంది. ఆ రోజునే A A22 మూవీ ప్రకటన రానుందని అంటున్నారు.

Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి
 
దీంతో రామ్ చరణ్ అభిమానులకు కౌంటర్ గా... ఇవాల్టి నుంచే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే ట్రెండింగ్ లో ఉన్న పెద్ది సినిమాను అల్లు అర్జున్ కొత్త సినిమా AA22 దాటేసింది. ఇక తాము తగ్గేదే లేదని... రామ్ చరణ్ ఫాన్స్ కూడా సోషల్ మీడియాలో.. కౌంటర్ స్టార్ట్ చేశారు. ఇలా ఇద్దరు బడా హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. దీంతో రెండు సినిమాల మీదా ఈ ప్రచారం ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం అందరిలో నెలకొంది. గతంలో సినిమా అభిమానుల మధ్య ఉన్న మంచివాతావరణం ఈమధ్య చెడిపోతుందన్న అభిప్రాయం చాలామందిలో నెలకొంది.

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

 

Advertisment
Advertisment
Advertisment