/rtv/media/media_files/2025/04/25/XO0XfmomtbVlRBG3Ob2Q.jpg)
anvesh sensational comments on bigg boss contestants
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. బైరసన్ వ్యాలీలో టూరిస్టులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపి 28 మందిని హతమార్చారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడిదే హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ సంచలన వీడియో రిలీజ్ చేశాడు. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో ఈ ఉగ్రదాడికి ముఖ్య కారణం వీరేనంటూ ముగ్గురు ఫొటోలను షేర్ చేశాడు. అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఉన్నారు.
ఉగ్రదాడికి వీరే కారణం
అనంతరం ఆ వీడియోలో అన్వేష్ సంచలన విషయాలు పంచుకున్నాడు. ముందుగా మెహబూబ్ గురించి చెప్పాడు. ‘‘మెహబూబ్ తిండికి తికానా లేని మటన్ కొట్టు మస్తాన్ రావు కొడుకు. అలాంటిది.. రూ.2 కోట్లు ఖర్చు పెట్టి ‘నువ్వే కావాలి’ అనే వీడియో తీశాడు. అది కూడా అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, మెక్సికో.. 4 దేశాలు తిరిగా ఆ వీడియో తీశాడు. ఒక్క యూట్యూబ్ వీడియో కోసం రూ.2 కోట్లు ఖర్చుపెట్టాడు. ఆ వీడియో కోసం ఖర్చు పెట్టిన డబ్బులు అన్నీ ఉగ్రవాద సంస్థలు ఇచ్చినవే.
అలాగే సోహెల్కు నాలుగు రెస్టారెంట్లు.. ఒక సినిమా.. ఇలా మరెన్నో ఉన్నాయి. ఈ డబ్బులన్నీ కూడా ఉగ్రవాద సంస్థలు ఇచ్చినవే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల వీరికి ఆ డబ్బులు వచ్చాయి. ఇంకా పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కూడా ఉన్నాడు. ఇతడు.. దుబాయ్లోని హోటళ్లు, దుబాయ్లో షాపులు, శ్రీశైలంలో కాటేజీలు, ఇండియాలో ఖరీదైన రెస్టారెంట్లు, లగ్జరీ కార్లు.. ఇలా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ డబ్బులన్నీ ఉగ్రవాద సంస్థలు ఇచ్చాయి.
అయితే వాళ్లెందుకు ఇచ్చారంటే.. ఉగ్రవాదులు వీళ్లతో కాంటాక్ట్ అయ్యి.. తమ యాప్లను ప్రమోట్ చేయాలంటూ వీరికి డబ్బులు ఇస్తారు. దాని కోసం వీరు తలో రూ.10 నుంచి 20 లక్షలు తీసుకుంటారు. ఆ యాప్ ఏంటి..? అది ఎవరు క్రియేట్ చేశారు..? అది ఎక్కడ నుంచి వచ్చింది? అనేది అస్సలు పట్టించుకోరు. ఆ యాప్లు వాడి చనిపోయినవారెందరో ఉన్నారు. కానీ వీళ్లు మాత్రం విదేశీ ట్రిప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఉగ్రవాదులు ఇచ్చిన డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది. ఈ దాడికి ఈ ముగ్గురే కారణం’’ అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
naa anveshana | Pahalgam attack | latest-telugu-news | telugu-news
అది జల యజ్ఞం కాదు ధనయజ్ఞం.. జగన్ కు మంత్రి ఘాటు కౌంటర్!
జగన్ కు అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ పోలవరం ఎత్తుపై తప్పుడు ప్రచారం మానుకోమంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. జల యజ్ఞం పేరిట వైఎస్ కుటుంబం ధనయజ్ఞం చేసిందని ఆరోపించారు.
AP News: ఏపీ మాజీ సీఎం జగన్ కు అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కన్నతల్లిని తోడబుట్టిన చెల్లిని మోసం చేసి జగన్ పోలవరం ఎత్తుపై తప్పుడు ప్రచారం మానుకోమంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ఈ మేరకు ‘ప్రపంచ చరిత్ర తిరగేస్తే తల్లిని, చెల్లిని మోసం చేసిన వంటి దౌర్భాగ్య రాజకీయవేత్త ఎక్కడా కనిపించడు ఇతను తప్ప. ప్రజా జీవనంలో ఉండడానికి అర్హత లేదన్న విషయం జగన్ కు అర్థం అయిపోయింది. అందుచేతనే డైవర్షన్ పోలిటిక్స్ కు తెరలేపాడు. పోలవరం ఎత్తుపై అతని చెత్త మీడియాలో అబద్ధాలు, అచ్చు వేసి గడిచిన రెండు రోజులుగా దుష్ప్రచారం చేస్తున్నాడు. దానికి నేను పూర్తి వివరాలతో జగన్ పోలవరం ప్రాజెక్టుకు చేసిన ద్రోహం గురించి వివరించానని చెప్పారు.
జల యజ్ఞం పేరిట ధనయజ్ఞం..
జగన్ బుద్ధి మారలేదు. రాష్ట్రానికి జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమే. నాడు జల యజ్ఞం పేరిట ధనయజ్ఞం చేశారు. కృష్ణ మిగులు జలాల్లో హక్కు కోరబోమని బ్రిజెష్ కుమార్ ట్రిబ్యునల్ కు లేఖ రాసి ఇచ్చి ద్రోహం చేశాడు. పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో 15 నెలలు ఆలస్యం చేసి డయాఫ్రమ్ వాల్ విధ్వంసానికి కారుకులయ్యారు. ఇసుక మాఫియాతో అన్నమయ్య డ్యాంను కూలగొట్టి 38 మంది ప్రాణాలు పోగొట్టాడు. పులిచింతల, గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోవడం జగన్ పాపం కాదా అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: జగన్ కు బిగ్ షాక్.. మీటింగ్ మధ్యలోనే అలిగి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే
కుటుంబ కలహాల్ని చక్కబెట్టుకో..
పోలవరానికి కేంద్రం ఇచ్చిన రూ.3800కోట్లు దారి మళ్లించి నదుల అనుసంధానానికి గండి కొట్టాడు. పోలవరం ఎత్తు తగ్గించడానికి రెండు పేజ్ లుగా విభజించింది జగన్ కాదా.. కేంద్రాన్ని 41.15 మీటర్లకు తగ్గించి అనుమతి కోరింది జగన్ కాదా.. మా ఎన్డీఏ ప్రభుత్వం పోలవరం ఎత్తు 45.72 మీటర్లు పెంచి నదుల అనుసంధానం చేసి సస్యశ్యామల ఆంధ్రప్రదేశ్ గా ఆవిర్భవింపచేస్తాం. ఇప్పటికైనా అబద్ధాలు మాని నీ కుటుంబ కలహాల్ని చక్కబెట్టుకో.. ఇది నీ హితువు కోరి చెబుతున్నా’ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
ఇది కూడా చదవండి: TG Train: తెలంగాణ రైలు ప్రయాణికులకు శుభవార్త.. మరో రెండు కొత్త లైన్లు!
Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి బిగ్బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!
పహల్గాంలో ఉగ్రాదాడి ఘటనపై అన్వేష్ స్పందించాడు. ఈ దాడికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, ఇమ్రాన్ ప్రధాన కారణమన్నాడు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Honey Bees Attack: పెళ్లికెళ్తే చచ్చేంతపనైంది.. తేనెటీగల దాడిలో స్పాట్లోనే 50 మంది!
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పెళ్లిబృందపై తేనెటీగలు దాడి చేశాయి. డీజే సౌండ్తో ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లివారిపై ఒక్కసారిగా దాడికి దిగాయి. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
Vidadala Rajini : విడదల రజనికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట!
మాజీ మంత్రి విడదల రజనికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో తొందరపాటు చర్యలు Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
🔴Live News Updates: ఈడీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. సోనియా, రాహుల్ లకు భారీ ఊరట!
Stay updated with the latest live news Updates......... క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Terror Attack Vijayawada: ఉలిక్కిపడ్డ 'బెజవాడ'.. ఆ ప్రాంతంలో ఉగ్రవాద కదలికలు..!
Terror Attack Vijayawada: జమ్మూ కశ్మీర్లోని(Jammu and Kashmir) పహల్గాం(Pahalgam) ప్రాంతంలో ఇటీవల జరిగిన...... Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Ntr District కారు భీభత్సం .. ఏడుగురు అడ్డాకూలీలు పైకి దూసుకెళ్లింది..
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కారు భీభత్సం సృష్టించింది. చెరువు బజారు కట్ట వద్ద కూలీలు అందరు నిలబడి ఉండగా.. వేగంగా Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్.
Sania Mirza : ఇంకో మూడు సార్లు ప్రెగ్నెంట్ అవుతానేమో కానీ.. ఆ పని మాత్రం కష్టం!
వేసవిలో సాయంత్రం కాల్చిన మఖానా తింటే ప్రయోజనాలు
Realme 14T 5G: రియల్మి నుంచి బ్లాక్ బస్టర్ స్మార్ట్ఫోన్.. సేల్ షురూ - ధర, ఆఫర్ల వివరాలివే!
Fridge Water ఫ్రిడ్జ్ నీళ్లతో గుండెపోటు.. ఇది తెలిస్తే మళ్ళీ తాగరు.
Chanakya: చాణక్య నీతి..ఇలాంటి వారికి ఎంత చెప్పినా జన్మలో మారరు