వైసీపీ అంటేనే ఫేక్.. లోకేష్ ఫైర్!

ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నారని వైసీపీ ఎంపీ గురుమూర్తి చేసిన ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు లోకేష్. వైసీపీ అధ్యక్షుడు నుంచి కార్యకర్త వరకు అందరు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను తమ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.

New Update
LOKESH

Lokesh:

మాజీ సీఎం జగన్ పై మరోసారి ట్విట్టర్ (X) వేదికగా నిప్పులు చెరిగారు మంత్రి లోకేష్. అధ్యక్షుడు జగన్ నుంచి వైసీపీ కార్యకర్త వరకు అందరూ ఫేక్ ప్రచారమే ఆయుధంగా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీలో చికిత్సలు తగ్గించారని, ఆరోగ్యశ్రీ పథకం నిలిపివేస్తున్నారని తప్పుడు ప్రచారంలో వైసీపీ ఎంపీ గురుమూర్తి కూడా భాగమయ్యారని అన్నారు. 

ఫేక్‌కి ఫ్యాక్ట్‌కి తేడా తెలియని ఎంపీ గారు మీ హయాంలోనే పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలను తాము చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీని పేదలకు వరంగా అందిస్తున్నట్లు తెలిపారు. తప్పుడు ప్రచారాలు మానండి ఎంపీ అంటూ చురకలు అంటించారు. మీ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చే పనిలో మా ప్రభుత్వ సహకారం తీసుకోండి.. అప్పుడు ఎన్నుకున్న మీ ప్రజలకు న్యాయం చేసిన వారు అవుతారు అని హితవు పలికారు.

#lokesh
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్...

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment