శ్రీవారి భక్తులకు జగన్ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే ఎమ్‌ఎస్ రాజు

మాజీ సీఎం జగన్ తిరుపతి లడ్డూని అపవిత్రం చేశారని మడకశిర ఎమ్మెల్యే ఎమ్‌ఎస్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలలో చేసిన అక్రమాలపై తప్పులు ఒప్పుకుని స్వామివారి భక్తులకు క్షమాపణలు చెప్పాలన్నారు. 

New Update
madakasira mla raju

దేశ వ్యాప్తంగా తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ విషయం సంచలనం రేపుతుంది. ఈ విషయమై టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ తిరుపతి లడ్డూని అపవిత్రం చేశారని మండిపడ్డారు. మడకశిర పట్టణంలో జగన్ దిష్టి బొమ్మను ఎమ్‌ఎస్ రాజు దగ్ధం చేశారు.

అపవిత్రం చేసిన ఘనత వైసీపీకే దక్కుతుంది

ప్రపంచ వ్యాప్తంగా తిరుమల దేవస్థానానికి ప్రఖ్యాత ఉందన్నారు. ఇంతటి ప్రసిద్ధి చెందిన తిరుపతిని అపవిత్రం చేసిన ఘనత వైసీపీ పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్యే ఎమ్‌ఎస్ రాజు మండిపడ్డారు. లడ్డూ తయారీలో కల్తీకి పాల్పడిన నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దలను ఇప్పుడు భక్తులు కొడుతున్నారన్నారు. మాజీ సీఎం జగన్ ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకుని వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు క్షమాపణ చెప్పాలని రాజు డిమాండ్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు