Tirumala: తిరుమలలో మళ్లీ కనిపించిన చిరుత.. భక్తులకు TTD కీలక సూచనలు!

తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుమల అలిపిరి మార్గంలో గాలి గోపురం షాపుల దగ్గర మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంటకు చిరుత పులి కదలికలు అక్కడి దుకాణంలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. చిరుత సంచారంతో టీటీడీ భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

New Update
ttd chirutha

ttd chirutha

TTD: తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుమల అలిపిరి మార్గంలో గాలి గోపురం షాపుల దగ్గర మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంటకు చిరుత పులి కదలికలు అక్కడి దుకాణంలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. సీసీ కెమెరాలో వీడియో చూసి టీటీడీ భక్తులతోపాటు దుకాణ దారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నడక మార్గంలోకి వచ్చి పిల్లిని వేటాడి అటవీ ప్రాంతంలోకి చిరుత తీసుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. 

గుంపులు గుంపులుగా వెళ్ళాలని...

దృశ్యాలను చూసి షాక్‌కు గురైన దుకాణ దారులు వెంటనే ఫారెస్ట్, టీటీడీ విజిలెన్స్‌అధికారులకు ఫిర్యాదు చేశారు. చిరుత సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు వెంటనే రంగంలో దిగారు. నడక మార్గంలో భక్తులకు అలెర్ట్ చేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకే 12 ఏళ్ల లోపు చిన్న పిల్లలను నడక మార్గంలో తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం అనంతరం గుంపులు గుంపులుగా వెళ్ళాలని టీటీడీ  సూచించింది. ఫారెస్ట్, టీటీడీ విజిలెన్స్ అధికారులతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు టీటీడీ అదికారులు.


  
ఇటీవల కాలంలో తిరుమల జనావాసాల్లోకి చిరుతల సంచారం ఘటనలు ఎక్కువగా వినిపియటంతో.. భక్తులు ఆందోళనకు గురైతున్నారు. అంతేకాదు ఏ పక్క నుంచి ఏ ప్రమాదం వాటిల్లుతుందోనని బిక్కు బిక్కుమంటూ ప్రజలంతా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. వారంరోజుల కిందట తిరుపతి శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ ఆవరణలో చిరుత   కలకలం రేపిన విషయం తెలిసింది. విశ్వవిద్యాలయ వసతి గృహాల దగ్గర చిరుత సంచారంతో విద్యార్థులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా.. టీటీడీ అధికారులు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఈ విత్తనాలను తింటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: పల్నాడులో ప్రైవేట్ బస్సు బోల్తా.. స్పాట్‌లోనే ఐదుగురికి..

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రైవేట్‌ బస్సు బోల్తా పడింది. కరికల్లు మండలంలోని శాంతినగర్ వద్ద చీరాల వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా మహిళ బస్సులోనే ఇరుక్కుపోయింది.

New Update
_Private bus overturns

_Private bus overturns

AP Crime: పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. నకరికల్లు మండలంలోని శాంతినగర్ వద్ద ఉదయం హైదరాబాద్ నుండి చీరాల వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, ఒక మహిళ బస్సులోనే ఇరుక్కుపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. రెండు గంటలుగా ఓ మహిళను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బస్సు పూర్తిగా బోల్తా పడటంతో లోపల చిక్కుకున్న మహిళను రక్షించడం కష్టం అయినప్పటికీ.. సహాయక బృందాలు నిపుణుల సహాయంతో క్షుణ్నంగా చర్యలు చేపడుతున్నాయి.

వేగంగా వెళ్తుండటమే ప్రమాదానికి..

గాయపడిన ప్రయాణికులను వెంటనే నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బస్సు ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. వేగంగా వెళ్తుండటమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్లు సమాచారం. ఎస్పీ శ్రీనివాసరావు, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: ఉదయాన్నే కలబంద రసం తాగితే 100 వ్యాధులు దరిచేరవు

సంఘటనాస్థలంలో ఎక్కడికక్కడ ప్రయాణికుల వస్తువులు చిందిపోవడం, గాయాలపాలైన  వారు విలవిల్లాడటం అక్కడి దృశ్యాలు అందరిని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. పోలీసులు, స్థానిక ప్రజలు కలిసి బాధితులను రక్షించేందుకు కృషి చేశారు. బాధితులకు అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలను అందించేందుకు జిల్లా వైద్య శాఖ సన్నద్ధమవుతోంది. ప్రైవేట్ బస్సుల వేగం, నిర్వహణపై మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: విశాఖలో దారుణం..కత్తులతో పొడిచి దంపతుల హత్య

( ap crime updates | ap-crime-news | ap crime latest updates | latest-news)

Advertisment
Advertisment
Advertisment