Ontimitta Kodandaramundu : వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముని రథోత్సవం

ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో  భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి గ్రామవీధుల్లో విహరించారు. ఉదయం పదిన్నర గంటలకు రథోత్సవం నిర్వహించారు.

New Update
Ontimitta Sitarama Kalyanam

Ontimitta Sitarama Kalyanam

Ontimitta Kodandaramundu : ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో  భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి గ్రామవీధుల్లో విహరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం పదిన్నర గంటలకు రథోత్సవం నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత కోదండరామయ్య రథంపై విహరించారు. భజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు.

 Also Read: ఫ్యాన్స్ కు మెగా ట్రీట్.. 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్


ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వి వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో నటేష్ బాబు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌ నవీన్, ఇంజినీరింగ్ అధికారులు, భ‌క్తులు పాల్గొన్నారు. కాగా నిన్న రాత్ని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణం తరువాత గజవాహనంపై సీతారాములు భక్తులకు దర్శనమిచ్చారు. సీతారాములు మాత్రమే కలిసి విహరించే ఈ వాహనానికి ఎంతో విశిష్టత ఉంది. వాహన సేవలో టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Also Read: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?
 
శుక్రవారం పండు వెన్నెల్లో శ్రీకోదండరాముని కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. సీతారామచంద్రుల కల్యాణ మహోత్సవ సందర్భంగా కోదండ రామాలయాన్ని శోభాయమానంగా ముస్తాబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఏకశిలా నగరంగా పేరొందిన ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు భక్తజనం అశేషంగా తరలివచ్చారు.

Also Read: 'ప్రభాస్'ని పక్కన పెట్టి అలియా భట్ తో నాగ్ అశ్విన్ మూవీ..!

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

 


  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Honey Bees Attack: పెళ్లికెళ్తే చచ్చేంతపనైంది.. తేనెటీగల దాడిలో స్పాట్‌లోనే 50 మంది!

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పెళ్లిబృందపై తేనెటీగలు దాడి చేశాయి. డీజే సౌండ్‌తో ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లివారిపై ఒక్కసారిగా దాడికి దిగాయి. ఈ దాడిలో 50 మంది గాయపడ్డారు. దీంతో వెంటనే బాధితులకు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.

New Update
Honey Bees Attack

Honey Bees Attack

ఏపీలోని పార్వతీపురంలో దారుణం జరిగింది. పెళ్లి కోసం వెళ్లిన జనాలు.. చావు అంచుల వరకు వెళ్లారు. ఊరు ఊరంతా డీజే పాటలకు డ్యాన్స్ వేస్తున్న సమయంలో తేనెటీగలు ఒక్కసారిగా అటాక్ చేశాయి. దీంతో పదుల సంఖ్యలో పెళ్లి బృందం హాస్పిటల్‌పాలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పెళ్లిబృందపై తేనెటీగలు దాడి చేశాయి. డీజే సౌండ్‌తో ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లివారిపై ఒక్కసారిగా దాడికి దిగాయి. ఈ తేనెటీగల దాడిలో సుమార్ 50 మంది గాయపడ్డారు. దీంతో వెంటనే బాధితులకు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.

వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వెంటనే బాధితుడిని పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఈ తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడిన పెళ్లి వారు.. హాస్పిటల్‌లో నొప్పిని భరించలేక ఏడుస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. 

గతంలో చావు దగ్గర సంఘటన

ఏపీలోని అల్లూరి జిల్లాలోని గన్నేరు కొయ్యపాడులో కొప్పుల పల్లాయమ్మ (86) మృతి చెందింది. దీంతో శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అంతిమయాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగానే శవాన్ని పాడెపై ఎక్కించి తీసుకెళ్తుండగా.. అదే సమయంలో బాణాసంచా కాల్చారు. 

దీంతో అందులో కొన్ని టపాకాయలు పక్కనే ఉన్న చెట్టుపై పడ్డాయి. సరిగ్గా అక్కడే తేనెతుట్టు ఉండటంతో దానికి ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా చెల్లా చెదురయ్యాయి. అదే సమయంలో అంతిమయాత్రలో ఉన్న వారిపై ఏకదాటిగా దాడి చేశాయి. దీంతో అంతిమయాత్రలో పాల్గొన్నవారంతా మృతదేహాన్ని రోడ్డుపై వదిలేసి పరుగులు పెట్టారు. 

ఈ ఘటనలో దాదాపు 40 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని గౌరీదేవి పేట PHCకి తరలించి చికిత్స అందించారు. ఇంకొంతమంది భద్రాచలంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈ తేనెటీగల దాడి అనంతరం బంధువులు అంత్యక్రియలు పూర్తి చేశారు. దీంతో ఈ ఘటనతో చాలా మంది ఉలిక్కి పడ్డారు. చావుకు వెళ్తే చచ్చేంత పనైందిరా బాబు అంటూ పలువురు బందువులు మాట్లాడుకున్నారు. 

Honey Bees Attack | latest-telugu-news | telugu-news | viral-news

Advertisment
Advertisment
Advertisment