వెండితెరపై దువ్వాడ-మాధురి లవ్ స్టోరీ.. టైటిల్ అదిరిపోయిందిగా!

దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి లవ్ స్టోరీ వెండితెరకెక్కనుంది. వీరిద్దరే హీరోహీరోయిన్‌గా 'దువ్వాడ జీవిత గాథ' అనే టైటిల్‌తో తమిళ నిర్మాత తెరకెక్కించనున్నారు. 2025 జనవరిలో ఈ సినిమానుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

New Update
bbg

Duvvada-Madhuri: తెలుగు రాష్ట్రాలు, రాజకీయాల్లో సంచలనంగా మారిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి లవ్ స్టోరీ వెండితెరకెక్కనుంది. కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరి జీవితగాథను సినిమా రూపంలో చూపించేందుకు తమిళనాడుకు చెందిన నిర్మాత ముందుకొచ్చారు. దువ్వాడ శ్రీనివాస్, మాధురి హీరో హీరోయిన్ గా తెరకెక్కించిన చిత్రానికి 'దువ్వాడ జీవిత గాథ' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసిన ప్రొడ్యూసర్.. తెలుగు, తమిళ్, హిందీ, కర్నాటక భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

అంతేకాదు 2025 జనవరి నాటికి వీరిద్దరి కాంబోలో చిత్రీకరించిన తొలి పాట రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే రైటర్స్, ప్రొడ్యూసర్ తో దువ్వాడ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక దువ్వాడ మొదటి భార్య వాణి క్యారెక్టర్ ఎలా చూపించాలనే అంశంలో తర్జనభర్జన పడుతున్నారని, త్వరలోనే స్ర్కిప్ట్ ఫైనల్ చేయబోతున్నట్లు సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

#divvela-madhuri #duvvadasrinivas
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Pavan Kalyan Son: పవన్ తనయుడు ఎలా అయిపోయాడో చూశారా...

Pavan Kalyan Son: పవన్ తనయుడు ఎలా అయిపోయాడో చూశారా?.. ఫొటోలు వైరల్

పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్‌ హెల్త్ అప్డేట్ వచ్చింది. మరో మూడు రోజుల పాటు మార్క్ హాస్పిటల్‌లోనే ఉండనున్నాడు. వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు సమాచారం. తాజాగా మార్క్ ఫొటో వైరల్‌గా మారింది.

New Update

సింగపూర్ లోని స్కూల్ బిల్డింగ్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం అతడికి వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే అగ్నిప్రమాదంలో వచ్చిన పొగ ఊపిరితిత్తుల దగ్గర పట్టేయడంతో భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందుల గురించి ముందుగానే పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

Also Read: మీరు ఐస్ క్రీమ్‌ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!

హెల్త్ అప్డేట్

ఇక ఇవాళ ఉదయం మార్క్ శంకర్‌ హెల్త్ కండీషన్ మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు అతడిని అత్యవసర వార్డు నుంచి జనరల్ వార్డుకు తరలించారు. అయితే ఇప్పుడిప్పుడే మార్క్ శంకర్‌ను డిశ్చార్జ్ చేయమని.. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు సమాచారం. 

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

Also Read: America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!

ఫొటో వైరల్

ఈ నేపథ్యంలో పవన్ తనయుడు మార్క్ శంకర్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడు నెబ్లైజర్‌తో ఆక్సీజన్ తీసుకుంటున్న ఫొటో ఒకటి చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా అతడి కుడి చేయికి ఒక కట్టు కూడా వేశారు. అయితే ప్రస్తుతం ఆ ఫొటో చూస్తుంటే మార్క్ శంకర్ హెల్తీగానే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు మార్క్ శంకర్ రెండు చేతులతో థమ్సప్ సింబల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. 

Also Read: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

(Pawan Kalyan | pawan kalyan son mark shankar | pawan son mark shankar school fire incident | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment