ఏపీలో ED రమేష్ ఎవరు?

మాజీ ఎంపీ MVV సత్యనారాయణపై ఈడీ దాడులు తమ బాసే చేయించారని వ్యాపారవేత్త లింగమనేని రమేష్, ఎంపీ CM రమేష్ అనుచరులు చెప్పుకుంటున్నారు. అయితే.. ED బూచి చూపించి MVV నుంచి 'పీక్' రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను లాక్కున్నారని విశాఖ TDP, YCP నేతలు ఆరోపిస్తున్నారు.

New Update
CM Ramesh

విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పై ఇటీవల ఈడీ దాడులు కొత్త చర్చకు దారి తీశాయి. ఈ దాడులు వెనుక ఎవరున్నారు అన్న అంశంపై ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ దాడులు జరిగిన తర్వాత వివాదాస్పద వ్యాపారవేత్త లింగమనేని రమేష్ అనుచరులు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అనుచరులు ఈ సోదాలు తమ బాస్ పుణ్యమేనని చెప్పుకుంటున్నారు. ఈ ఈడీ దాడుల క్రెడిట్ కోసం ఇద్దరు రమేష్‌ లు పోటీ పడుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ దాడుల వెనుక ఎవరు ఉన్నారు? ఎవరిప్రోద్బలంతో ఈ రైడ్స్ జరిగాయి? అన్న అంశంపై పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. దీంతో అసలు ఎవరి ప్రోద్బలంతో ఈ ఈడీ దాడులు జరిగిందో తెలియక వైసీపీ నేతలు బుర్ర గోక్కుంటున్నారు. మొత్తానికి ఈడీ బూచి చూపించి ఎంవీవీ సత్యనారాయణ చేతుల్లో నుంచి 'పీక్' రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను బలవంతంగా లాక్కున్నారని విశాఖకు చెందిన వైసీపీ, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Also Read:  RTV Exclusive: ఎవరైనా అమ్మ మీద కేసు వేస్తారా?: జగన్ కు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్!

ఈ నెల 19న దాడులు

ఇదిలా ఉంటే.. ఈ నెల 19న విశాఖలో వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ టార్గెట్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు నిర్వహించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ఉల్లంఘనలపై ఈ సోదాలు చేసినట్లు ఈడీ తెలిపింది. రూ.200 కోట్ల విలువైన 12.51 ఎకరాల ‘హయగ్రీవ’ భూమి అన్యాక్రాంతం కావడంపై దర్యాప్తు చేపట్టింది. వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల కోసం ప్రభుత్వం ఈ భూమిని కేటాయించినట్లు తెలిపింది. అయితే.. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆయన ఆడిటర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు, మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ గద్దె బ్రహ్మాజీ మోసపూరితంగా ఈ ప్రాజెక్టును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

Also Read: అమరావతికి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. భారీగా నిధులు!

ఇంకా.. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి బినామీ లావాదేవీలు జరిపినట్లు ఈడీ వెల్లడించింది. ఈ మేరకు అరిలోవ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. ఎంవీవీ, ఆయన ఆడిటర్ జీవీ నివాసాలు, ఆఫీసుల్లో రైడ్స్ సందర్భంగా బినామీ పట్టాదారు పాసుపుస్తకాలు, డిజిటల్‌ పరికరాలను గుర్తించినట్లు ఈడీ తెలిపింది. అయితే.. ఈ డిజిటల్‌ పరికరాలతోనే ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేశారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Also Read:  4.5 కిలోల గోల్డ్..కోట్లలో..ప్రియాంక ఆస్తుల వివరాలివే!

Also Read: దూసుకొస్తున్న దానా తుఫాన్‌.. గంటకు 120 కి.మీ వేగంతో..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: 45 రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

TTD 45రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో మే1 - జూన్ 15 వరకు ఎమ్మెల్యే,ఎంపీ, ప్రముఖుల సిఫార్సులపై జారీచేసే బ్రేక్ దర్శనాలను క్యాన్సిల్ చేసింది. ప్రొటోకాల్ పరిధి ప్రముఖులు స్వయంగా వస్తే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది.

New Update
TTD cancels VIP break darshans for 45 days

TTD cancels VIP break darshans for 45 days

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 45 రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవులు ప్రారంభం అయ్యియి. దీంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

Also Read: పహల్గాం దాడిని పూర్తిగా షూట్‌ చేసిన వీడియోగ్రాఫర్‌.. కానీ

మే1 నుంచి రద్దు

ఇందులో భాగంగా మే 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ప్రముఖుల సిఫార్సులపై జారీ చేసే బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. అదే సమయంలో కేవలం ప్రొటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులు స్వయంగా వస్తేనే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది. ఈ మేరకు మే 1వ తేదీ నుంచి ఉదయం 6 గంటలకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. 

Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?

ఒక్కరోజే 82,811 మంది భక్తులు

ఇదిలా ఉంటే TTDలో టోకెన్లు లేని భక్తులకు దాదాపు 18 గంటల సమయం పైనే పడుతోంది. కేవలం ఒక్క శనివారం రోజే భారీగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. సుమారు 82,811 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదే సమయంలో 34,913 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కేవలం ఆ ఒక్క రోజే రూ.3.24 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం వచ్చింది. 

Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు

Also read: కాంగ్రెస్ వాళ్లను ఉరికిచ్చి కొడతా... ఎర్రబెల్లి దయాకర్ రావు ఫుల్ ఫైర్

telugu-news | ttd | latest-telugu-news | tirumala tirupati temple

Advertisment
Advertisment
Advertisment