/rtv/media/media_files/2025/03/23/DIOwjXUEkabwqQJOabWI.jpg)
Sexual assault
Sexual assault : కాకినాడ జిల్లా పెద్దాపురంలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఇద్దరు బాలికలపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన స్థానికులు సదరు వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు. స్థానికుల కథనం మేరకు శనివారం స్థానిక దర్గా సెంటర్లో బంగారు ఆభరణాలు తయారీ షాపు నిర్వహిస్తున్న యజమాని కామేశ్వరరావు ఇద్దరు చిన్నారులపై అత్యాచారం చేశాడు. రెండు, ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు కామేశ్వరరావు. చిన్నారులకు చాకెట్లు, డబ్బుల ఆశచూపి రేప్ కామేశ్వరరావు రేప్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read: రీ-రిలీజ్ రికార్డులు బద్దలు కొట్టిన 'సలార్'.. అరాచకం సామి ఇదీ!!
Also Read: దెయ్యాలతో చెడుగుడు ఆడేస్తాం.. ఎనీ డౌట్స్..?
కొంతకాలంగా చిన్నారులపై కామేశ్వరరావు అత్యాచారం చేస్తున్నట్లు వారి బంధువులు ఆరోపిస్తున్నారు. స్కూలు నుంచి ఇంటికి వచ్చిన చిన్నారులకు తీవ్ర కడుపునొప్పి రావడంతో పిల్లలను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా చిన్నారులను పరీక్షించిన డాక్టర్లు వారి ప్రైవేట్ పార్ట్స్లో తీవ్రగాయాలైనట్లు డాక్టర్లు గుర్తించారు.
Also Read: లారెన్స్ మామూలోడు కాదుగా.. ఈ సారి ఏ దెయ్యానికి బాడీ అద్దెకు ఇస్తున్నాడంటే..?
దీంతో పిల్లలను విచారించగా కామేశ్వరరావు చేసిన అఘాయిత్యం వెలుగులోకివచ్చింది.దీంతో ఆగ్రహానికి గురైన చిన్నారుల బంధవులు స్థానికులు కామేశ్వరరావుపై చెప్పులు ,చీపుర్లతో దాడి చేశారు. దీంతో కామేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు తీవ్రంగా గాయపడటంతో అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఘటనపై ఎస్ఐ మౌనికను వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇది కూడా చూడండి: Drinking Water: నీరు ఎక్కువగా తాగడం కూడా ప్రమాదమేనా..రోజుకు ఎన్నిగ్లాసులు తాగాలి?
ఇది కూడా చూడండి: High Heels: హైహీల్స్ వేసుకుంటే మానసిక ఆరోగ్య సమస్యలు తప్పవా?