/rtv/media/media_files/2025/04/06/aPkMPjDApiq0jmwAaugy.jpg)
Rains
ఏపీ ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తూ వాతావరణశాఖ చల్లని కబురు మోసుకొచ్చింది. రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో-4, విజయనగరం జిల్లాలో-5, పార్వతీపురం మన్యం జిల్లాలో-8.. మొత్తం 17 మండలాల్లో తీవ్రవడగాలులు, 21 మండలాల్లో వడగాలులు ప్రభావంచూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
Also Read: Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం..ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్
దోర్నిపాడులో 43.8 , పెద్దదోర్నాలలో 43.8 , కడపలో 43.6 , విజయనగరంలో 42.8 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. అలాగే 139 ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు సమాచారం. వచ్చే ఐదు రోజుల్లో రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్యలో నమోదవుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read: Telangana: నిప్పుల కుంపటిల రాష్ట్రం.. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
మరోవైపు మే తొలి వారంలో అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ చెబుతుంది. వాతావరణశాఖ. వచ్చే నెల రోజుల్లో ఎల్నినో తటస్థంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మే మొదటి వారంలోనే సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వానలు పడే అవకాశాలు ఉన్నాయి. ఏపీలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో భానుడి భగభగలకు జనాలు అల్లాడిపోతున్నారు. గత కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. గురువారం దొర్నిపాడులో 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 'పాణ్యం 42.5, గడివేముల 42.4, కర్నూలు అర్బన్, కొత్తపల్లి, నంద్యాలలో 42.3 , గోస్పాడు, రుద్రవరంలో 43.4, బండి ఆత్మకూరు 42.2, బనగానపల్లి, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ 42.0, డోన్, ప్యాపిలి 41.9, బేతంచెర్ల 41.6, కోడుమూరు, ఆళ్లగడ్డ 42.8, కౌతాళం 42.7, నమోదైనట్లు అధికారులు తెలిపారు. నందికొట్కూరు, శిరివెళ్ల 41.3, శ్రీశైలం 41.2, కోసిగి, మద్దికెర, పగిడ్యాల 41.1, ఓర్వకల్లు, తుగ్గలి, చాగలమర్రి,మంత్రాలయం, సంజామల, ఆత్మకూరు, కొలిమిగుండ్ల, పాములపాడు 41.7, కల్లూరు, మిడుతూరులో 41.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి' అని అధికారులు తెలిపారు.
Also Read: Ap Govt:ఏపీలో వారికి జీతాలు పెంచిన ప్రభుత్వం..
Also Read: ఆయుధాలతో శ్రీనగర్లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్
ap | rain-alert | ap rain alert | heavy rain alert ap | rains | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates
అన్న కోసం చాలా చేశా.. జగన్ నాకోసం ఏమీ చేయలేదు.. షర్మిల కంటతడి
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్న కోసం తాను చాలా చేశానని.. జగన్ మాత్రం తనకోసం ఏమీ చేయలేదంటూ కంటతడిపెట్టుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైవీ సుబ్బారెడ్డి.. జగన్ మోచేతి నీళ్లు వ్యక్తి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. '' సుబ్బారెడ్డి జగన్ పక్కన ఉండి పదవులు అనుభవిస్తున్నారు. రాజకీయంగానే కాకుండా ఆర్థికంగానూ లాభపడ్డారు. ఈరోజు సుబ్బారెడ్డి మాట్లాడారు. రేపు సాయిరెడ్డి మాట్లాడతారు. సుబ్బారెడ్డి, సాయిరెడ్డి లలో నిజాయితీ ఉందో లేదో చూద్దామని ఇద్దరి పేర్లు లేఖలో రాశా. అన్ని తెలిసి కూడా దిగజారిపోయి మాట్లాడుతున్నారు
ఎవరు చెప్పింది నిజమో నా బిడ్డలపై ప్రమాణం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నా సుబ్బారెడ్డి ప్రమాణం చేస్తారా ?. ఆస్తుల వివాదంపై విజయమ్మ మాట్లాడతారో లేదో ఆమె ఇష్టం. నలుగురి బిడ్డలకు సమానంగా ఆస్తులు ఇవ్వాలని వైఎస్ఆర్ అనుకున్నది పచ్చి నిజం. నలుగురు బిడ్డలకు సమాన వాటా ఇవ్వాలని రాజశేఖర్ రెడ్డి అన్నారు. నాన్న నీ తర్వాత చెల్లి మేలు కోరేది నేనే అని జగన్ వైఎస్ఆర్తో అన్నారు. అలా అడగలేదని జగన్ తన పిల్లలపై ప్రమాణం చేసి చెప్పగలరా ?. జగన్ భారతి పేర్లు పెట్టుకున్నారు కనుక ఆస్తులు మావి అంటే ఎలా ?. వాళ్ళు పేర్లు పెట్టుకోగలిగారు అంటే మా అంగీకారంతోనే.
నేను జైలుకి వెళ్ళలేదు అని అడుగుతున్నారు మరి భారతి ఎందుకు జైలుకి వెళ్ళలేదు. గిఫ్ట్ ఇస్తామని MOU ఎవరూ రాయరు. నాకు ఆస్తులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టే MOU రాశారు. . సరస్వతి షేర్స్ వెంటనే ట్రాన్ఫర్ చేస్తామని MOUలో ఉంది. సరస్వతి షేర్స్ ఈడి అటాచ్మెంట్లో లేదు. కన్న తల్లిపై కేసులు వేసే దౌర్భాగ్యలు ఎవరైనా ఉన్నారా ?. సొంత కొడుకే తనపై కేసు వెయ్యడంతో విజయమ్మ కుమిలిపోతున్నారు. తనకి లబ్ధి జరుగుతుందని తల్లిని కోర్టుకి ఈడుస్తారా ?. జగన్కు మానవత్వం, ఎమోషన్ సెంటిమెంట్స్ లేవా ?. సజ్జల, పేర్ని నాని ఏమి మాట్లాడినా నేను పట్టించుకోలేదు. కానీ సుబ్బారెడ్డి మాటలకు నా కళ్ళలో నీళ్లు వచ్చాయి.
సుబ్బారెడ్డి నా సొంత చిన్నాన్న. ఎందుకు నా బిడ్డలకు అన్యాయం చెయ్యాలని అనుకుంటున్నారు. అందరం కలిసి కష్టపడితే వైసీపీకి భారీ విజయం దక్కింది. నాకు చేతనైన దానికంటే ఎక్కువ కష్టపడి పని చేశా. విజయమ్మ కూడా ఎంతో కష్టపడి పని చేశారు. ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా పాదయాత్ర చేశా. రెండు ఎలక్షన్స్లో తక్కువ సమయంలో ఎన్నికల ప్రచారం చేశాను. నా అన్న కోసం చాలా చేశా.. జగన్ నాకోసం ఏమి చేయలేదు. MOU ఐదేళ్లుగా నా దగ్గర ఉన్నా ఏనాడు బయటపెట్టలేదు. వైఎస్ఆర్ పేరును ఛార్జ్షీట్టులో చేర్పించిన పొన్నవోలు సుధాకరరెడ్డి కి పదవులు ఇచ్చారు. జగన్ నాయకుడో, సాడిస్టో అర్థం చేసుకోవాలి. ఇలాంటి కొడుకుని చిన్నప్పుడే చంపేస్తే బాగుణ్ణు కదా అని అమ్మ అనుకోలేదు.. నేను చచ్చిపోతే బాగుండు అనుకుందని'' షర్మిల అన్నారు.
Ap Rain Alert:ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు!
ఉత్తరాంధ్రలో శని, ఆదివారాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే, శ్రీకాకుళం, విజయనగరంలో వడగాలులు తీవ్రంగా ఉంటాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
🔴Live News Updates: బీజేపీకి భారీ షాక్..!! ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు.
Stay updated with the latest live news Updates......... క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Ap Govt:ఏపీలో వారికి జీతాలు పెంచిన ప్రభుత్వం..
ఏపీ ప్రభుత్వం దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు శుభవార్త చెప్పింది.కేశఖండనశాలల్లో పనిచేసేవారి కనీస కమీషన్ను పెంచింది. గతంలో రూ.20 వేలు ఉండగా ఇప్పుడు రూ.25 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
TTD:తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. ఇకపై ఉచితంగానే..!
తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య సంకీర్తనలను యూట్యూబ్ ద్వారా ప్రజలకు అందించాలని ఈవో జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Aghori - Sri Varshini: నా బావ జైలులో నన్ను వేసేయండి.. బోరున ఏడ్చేసిన వర్షిణీ
అఘోరీ అరెస్టు తర్వాత శ్రీవర్షిణి బోరున ఏడ్చేసింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. తనను పంపిస్తే.. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Pahalgam Attack: ముమ్మాటికి భద్రతా లోపమే.. అమిత్ షా, మోదీ రాజీనామా చేయాలి.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!
ఉగ్రదాడి ముమ్మాటికి భద్రత లోపమేనని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. ఈ ఘటనకు అమిత్ షా, మోదీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కడప | ఆంధ్రప్రదేశ్
టార్గెట్ హైదరాబాద్.. ఆ ప్రాంతాలపైనే ఉగ్రవాదుల ఫోకస్!
BIG BREAKING: ఆర్మీ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా కమాండర్ మృతి
Ap Rain Alert:ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు!
Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం..ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్
Tamil Nadu Train Accident: తప్పిన ఘోర రైలు ప్రమాదం.. పట్టాలపై బోల్ట్లు పీకేసి..!