వైసీపీకి ఊహించని షాక్.. హైకోర్టు సంచలన తీర్పు!

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని ఏపీ హైకోర్టు తీర్పు నిచ్చింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నికలకు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలను ఈసీ రద్దు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

New Update
AP High Court MLC Elections

విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన వైసీపీ నాయకులు జిల్లాకు రాకముందే ఆ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న రఘురాజుపై మండలి చైర్మన్ మోషన్ రాజు వేసిన అనర్హత వేటును హైకోర్టు రద్దు చేసింది. అనర్హత వేటుపై గతంలోనే ఇందుకూరి రఘురాజు హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. న్యాయస్థానం నేడు ఈ అంశంపై తుది విచారణ నిర్వహించింది. ఆయనపై వేసిన అనర్హత వేటు చెల్లదని స్పష్టం చేసింది. దీంతో 2027 నవంబర్ 31 వరకు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.

Also Read: మేఘాకు బిగ్ షాక్.. ఆ రిజర్వాయర్ కాంట్రాక్ట్ రద్దు!

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్..

అయితే రఘురాజుపై వేటు పడడంతో ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 28న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 11 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడును ప్రకటించింది. అయితే.. ఇప్పుడు రఘురాజుపై ఉన్న అనర్హత వేటు చెల్లదని ఇప్పుడు హైకోర్టు తీర్పు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఎన్నికల సంఘం ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. విజయనగరం స్థానిక సంస్థల ఎన్నికను ఈసీ రద్దు చేసే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే.. ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ను సైతం రద్దు చేయాలని రఘురాజు హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.

Also Read: పవన్ Vs స్టాలిన్.. దక్షిణాదిలో బీజేపీ బిగ్ స్కెచ్!

విశాఖ ఎన్నికల్లో విజయంతో..

ఇటీవల జరిగిన విశాఖ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదే ఊపుతో విజయనగరంలోనూ విజయం సాధించి మండలిలో బలం పెంచుకోవాలని వైసీపీ భావించింది. స్థానిక సంస్థల్లో వైసీపీకి మెజార్టీ ఉంది. దీంతో తమ గెలుపు ఖాయమని ఆ పార్టీ లెక్కలు వేసుకుంది. కానీ ఊహించని విధంగా హైకోర్టు తీర్పు రావడంతో ఆ పార్టీ నేతలు షాక్ కు గురైనట్లు తెలుస్తోంది. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

ఏపీ సర్కార్ మైనరిటీల కోసం కొత్త పథకం తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. చిన్నతరహా యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ సబ్సిడీపై రుణాలు పొందవచ్చు. ఈ నెల 25 నుంచి దరఖాస్తు ప్రారంభం అయ్యింది.

New Update
cm chandra babu

cm chandra babu

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మైనారిటీల అభివృద్ధే ధ్యేయంగా వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. వ్యవసాయం, రవాణా, అనుబంధ రంగాలు, సేవా, వ్యాపార, పరిశ్రమ రంగాలలో స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు అందిస్తుంది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఈ పథకం ద్వారా మైనారిటీ నిరుద్యోగ యువతకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణం ఇస్తారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా మైనారిటీ సంక్షమ శాఖ రిలీజ్ చేసింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, కార్పెంటరీ వంటి వాటిలో కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఇటీవల కూటమి ప్రభుత్వం ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.173.57 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

మైనారిటీ నిరుద్యోగ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ నిధులను అందించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఏప్రిల్ 25 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా వచ్చే నెల అంటే మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అర్హతలు

ఆసక్తిగల దరఖాస్తు దారుడు మైనారిటీ వర్గానికి (ముస్లిం, క్రైస్తవులు, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్సీలు) చెందినవాడై ఉండాలి. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయి ఉండాలి.

21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో ఏడాదికి రూ.2,00,000, గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000 ఉండాలి. 

ఎవరైతే ఈ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారో.. స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

జనరిక్ ఫార్మసీ పథకాలకు డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ అర్హత కలిగి ఉండాలి.

https://apobmms.apcfss.in/  లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. https://apobmms.apcfss.in/RegistrationForm రిజిస్ట్రేషన్ ఫామ్‌లో డీటెయిల్స్ నింపాలి.

andhra-pradesh | cm-chandra-babu | ap-govt | ap-govt-schemes

Advertisment
Advertisment
Advertisment