Lady Aghori Arrest : గుంటూరులో ప్రత్యక్షమైన అఘోరీ.. అనిల్ బెహేరా పై సీరియస్

గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ హల్‌ చల్‌  చేస్తోంది. కాగా ఈ రోజు గుంటూరులో ప్రత్యక్షమైన అఘోరీ మరోసారి హల్‌చల్‌ చేసింది. హిందూ ఐక్య పోరాట వేదిక నేత అనిల్ బెహేరా అనుచిత వ్యాఖ్యలపై అఘోరీ నిరసన వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలకు డిమాండ్ చేశారు.

New Update
Lady Aghori Naga Sadhu Hulchul in Tanuku

Lady Aghori Naga Sadhu Hulchul in Tanuku Photograph: (Lady Aghori Naga Sadhu Hulchul in Tanuku)

Lady Aghori Arrest : గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ హల్‌ చల్‌  చేస్తోంది. కాగా ఈ రోజు గుంటూరులో ప్రత్యక్షమైన అఘోరీ మరోసారి హల్‌చల్‌ చేసింది.హిందూ ఐక్య పోరాట వేదిక నేత అనిల్ బెహేరా  చేసిన అనుచిత వ్యాఖ్యలపై అఘోరీ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అఘోరీ నిరసన చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని అఘోరీకి సూచించారు. అఘోరీ ఎంతకీ వినకపోవడంతో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  అనంతరం నల్లపాడు పోలీస్ స్టేషన్‌ కు తరలించారు.  

ఇది కూడా చదవండి: Breaking News : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్!

గుంటూరుకు చెందిన అనిల్ బెహరాపై పోలీసులకు అఘోరీ ఫిర్యాదు చేసింది. --అనిల్‌ బెహరా అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ అఘోరీ కంప్లైంట్‌లో పేర్కొంది. --అనిల్ రోజూ తనకు వాట్సాప్‌లో వీడియో కాల్ చేసి..--అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా పోలీసులు అఘోరీకి కౌన్సిలింగ్ ఇచ్చారు. --వివాదం వద్దంటూ లేడీ అఘోరీకి పోలీసుల కౌన్సిలింగ్‌ ఇచ్చారు. కాగా  అనిల్ ఛాలెంజ్ చేస్తేనే గుంటూరు వచ్చానని అఘోరీ వెల్లడించింది. అయితే అఘోరీని అరెస్ట్ చేసిన విషయం స్థానిక హిజ్రాలకు తెలియడంతో నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. అఘోరీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Also Read :  మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

కాగా లేడీ అఘోరీ కొద్ది రోజులుగా ఏపీలో హల్ చల్ చేస్తున్నారు. మార్చి 3న కూడా నెల్లూరు జిల్లా చిలకూరు మండలం భూధనం టోల్ ప్లాజా వద్ద ఆవులను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. డ్రైవర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సడెన్‌గా తణుకులో ప్రత్యక్షమయ్యారు. అఘోరా బాబాగా పిలవబడుతున్న రాజేష్ నాథ్‌పై అఘోరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేష్‌నాథ్‌ ఇంటి ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లి వదిలివేశారు. తాజాగా గుంటూరులో ప్రత్యక్షమై హల్ చల్ చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Also Read:  అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Terror Attack Vijayawada: ఉలిక్కిపడ్డ 'బెజవాడ'.. ఆ ప్రాంతంలో ఉగ్రవాద కదలికలు..!

పహల్గాం దాడి దృష్ట్యా విజయవాడలో ఉగ్రవాదుల కదలికలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. SIMI అనుచరులుగా భావిస్తున్న నలుగురిని గుర్తించి విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే విజయవాడలోని అనుమానిత ప్రాంతాలలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ చేపట్టాయి.

New Update
Terror Attack Vijayawada

Terror Attack Vijayawada

Terror Attack Vijayawada: జమ్మూ కశ్మీర్‌లోని(Jammu and Kashmir) పహల్గాం(Pahalgam) ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిచింది. ఈ దాడి నేపథ్యంలో దేశంలోని అనేక నగరాల్లో పోలీస్‌ విభాగాలు అప్రమత్తమయ్యాయి. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో కూడా ఉగ్రవాద కదలికలపై పోలీసులు   నిఘా పెట్టారు. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసారు.

Also Read: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'

విజయవాడ టార్గెట్‌గా..!

కేంద్ర నిఘా సంస్థలు ఇప్పటికే రెండు నెలల క్రితమే విజయవాడను టార్గెట్‌గా ఉంచుకుని ఉగ్ర ముప్పు పొంచి ఉండొచ్చని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో, నగరంలోని కొందరు వ్యక్తులపై పోలీస్‌ శాఖ నిఘా పెంచింది. తాజా సమాచారం ప్రకారం, సిమి (SIMI) తీవ్రవాద సంస్థకు మద్దతు పలికే నలుగురు అనుమానితులను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

Also Read: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

ఈ నలుగురిని పట్టుకోవాలనే ఉద్దేశంతో నగరంలోని గొల్లపూడి, అశోక్ నగర్, లబ్బీపేట ప్రాంతాల్లో పోలీసులు విస్తృత సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. వారి కదలికలపై పక్కాగా నిఘా పెట్టారు. విచారణలో ఇంకా నలుగురు సిమి అనుచరులు విజయవాడలో తలదాచుకుని ఉన్నట్లు తెలిపారు.

Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

ప్రస్తుతం మొత్తం ఎనిమిది మంది అనుమానితులపై దర్యాప్తు కొనసాగుతోంది. వీరిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ప్రతి చిన్న సమాచారం‌ను జాగ్రత్తగా విశ్లేషిస్తూ, ఉగ్రవాద ముప్పును అడ్డుకునేందుకు నిఘా సంస్థలు, స్థానిక భద్రతా దళాలు కలిసి పని చేస్తున్నాయి.

దేశ భద్రతను సవాల్ చేసేలా మారుతున్న ఉగ్రవాద కదలికలను ముందే గుర్తించి అడ్డుకోవడమే లక్ష్యంగా అధికారులు, పోలీస్ యంత్రాంగం  ప్రయత్నిస్తున్నారు. పహల్గాం దాడికి సంబంధించిన పరిణామాలు ఇంకా చల్లారకముందే, విజయవాడ వంటి శాంతియుత నగరాల్లో ఉగ్ర ముప్పు వార్తలు వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Also Read: New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

Advertisment
Advertisment
Advertisment