South Central Railway-Sankranti: సంక్రాంతికి 400 ప్రత్యేక రైళ్లు! సంక్రాంతి పండుగకు నాలుగు నెలల ముందే రెగ్యులర్ రైళ్లన్నీ నిండిపోయాయి. రిజర్వేషన్ ఓపెన్ చేసిన నిమిషాల్లోనే ఖాళీ అయిపోయాయి.ఈ క్రమంలో ప్రయాణికుల కోసం 400 స్పెషల్ సర్వీసులు నడపాలనిదక్షిణ మధ్య రైల్వే అధికారులు భావిస్తున్నారు. By Bhavana 19 Sep 2024 | నవీకరించబడింది పై 19 Sep 2024 20:27 IST in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Sankranti Trains: సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు రాష్ట్రాలకు పెద్ద పండుగ. ఏపీ నుంచి తెలంగాణ , ఇతర రాష్ట్రాలకు వెళ్లి స్థిరపడ్డవారు కచ్చితంగా ఎక్కడ ఉన్న సంక్రాంతికి సొంతూరుకు చేరుకుంటారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఏపీ కి వెళ్లాలనుకునేవారు ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకోవడంతో రైళ్లన్ని నిండిపోయాయి. సంక్రాంతి పండుగకు నాలుగు నెలల ముందే రెగ్యులర్ రైళ్లన్నీ నిండిపోయాయి. రిజర్వేషన్ ఓపెన్ చేసిన నిమిషాల్లోనే ఖాళీ అయిపోయాయి. ప్రస్తుతం వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోతోంది. సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి ఏపీకి వెళ్లే రైళ్లలో టికెట్లు బుక్ చేసుకుందామంటే ‘నో టికెట్స్’అని చూపిస్తుంది. వెయిటింగ్ లిస్ట్రిగ్రేట్ స్టేటస్చూపిస్తోంది. ఈ నేపథ్యంలో వెయిటింగ్ లిస్ట్ ను తగ్గించేందుకు రెగ్యులర్ రైళ్లకు అదనపు కోచ్లు ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్లాన్చేస్తున్నారు. అప్పటికీ సరిపోకపోతే మరో 400 స్పెషల్ సర్వీసులు నడపాలనిదక్షిణ మధ్య రైల్వే అధికారులు భావిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి ఏపీ, ఇతర ప్రాంతాలకు వెళ్లే గరీబ్ రథ్, ఫలక్నుమా, కోణార్క్, ఎల్టీటీ ముంబై, గోదావరి, విశాఖ ఎక్స్ప్రెస్తో సహా అనేక ఎక్స్ప్రెస్ రైళ్లు విశాఖపట్నం వైపు జనవరి 10, 11, 12 తేదీల్లో పూర్తిస్థాయిలో నిండిపోయాయి. కాకినాడ వైపు వెళ్లే కాకినాడ ఎక్స్ప్రెస్, ఎల్ టీటీ- కాకినాడ ఎక్స్ప్రెస్రైళ్లు రిగ్రేట్ స్టేటస్ చూపిస్తున్నాయని ప్రయాణికులు అంటున్నారు.. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, వెస్ట్ బెంగాల్ రైళ్లన్నీ ఏపీ మీదుగానే వెళ్తాయి. వీటన్నింటిలో కూడా టికెట్లు అయిపోయాయి. రద్దీకి అనుగుణంగా వివిధ మార్గాల్లో 400 స్పెషల్ సర్వీసులు నడపాలని ప్లాన్చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. Also Read: BIG BREAKING: జానీ మాస్టర్ అరెస్ట్ సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి