Andhra Pradesh: టీడీపీ నేత బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్.. కడప జిల్లా జైలుకు తరలింపు..

టీడీపీ నేత బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్ విధించారు కడప జిల్లా కోర్టు న్యాయమూర్తి. కడప విమానాశ్రయం వద్ద ఘర్షణ కేసు, టికెట్ బెట్టింగ్ కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అర్థరాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు.

New Update
Andhra Pradesh: టీడీపీ నేత బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్.. కడప జిల్లా జైలుకు తరలింపు..

Andhra Pradesh: మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పులివెందుల నియోజకవర్గం ఇన్‌ఛార్జి బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్ విధించింది కడప జిల్లా కోర్టు. దీంతో ఆయన్ను కడప జైలుకు తరలించారు పోలీసులు. రవిపై కడప విమానాశ్రయం వద్ద ఆందోళన కేసుతో పాటు.. టికెట్ బెట్టింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. బెట్టింగ్ కేసులో తాజాగా ఆయనకు 41 ఏ నోటీసులు జారీ చేశారు. అయితే, ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదే విషయాన్ని కడప జిల్లా న్యాయమూర్తికి తెలియజేశారు పోలీసులు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్ విధించారు. కాగా మొదట రవి రిమాండ్ రిపోర్ట్‌ను న్యాయమూర్తి వెనక్కి పంపించారు. అర్థరాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో.. ఇవాళ కడప కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించారు. 10 నెలల క్రితం జరిగిన ఘటనలో ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి? ఇన్ని రోజులు ఏం చేశారు? అంటూ పోలీసులను ప్రశ్నించారు న్యాయమూర్తి. దాంతో.. రవిపై బెట్టింగ్ కేసులో 41 ఏ నోటీసులు జారీ చేసినట్లు వివరించారు పోలీసులు.

కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిళ నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభించడానికి రెండు రోజుల ముందు జనవరి 25వ తేదీన కడపలో పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా లోకేష్‌కు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులతో కలిసి విమానాశ్రయం వద్దకు వచ్చారు బీటెక్ రవి. అయితే, విమానాశ్రయంలో వెల్లడానికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఆ సందర్భంగా పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. పోలీసులు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనపై వల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు, ప్రస్తుతం బెట్టింగ్ కేసులో బీటెక్ రవిని ఇప్పుడు అరెస్ట్ చేశారు పోలీసులు.

Also Read:

నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు.. ఇవాళే చివరి తేదీ.. అప్లై చేశారా?

ముగిసిన ఐటీ సోదాలు.. మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో ‘కోట్ల’ కట్టలు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Inter Supplementary Exams : ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.. ఫీజు చెల్లింపునకు తుది గడువు ఇదే

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  

New Update
Inter Supplementary Exams

Inter Supplementary Exams

Inter Supplementary Exams:  ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. కాగా ఇంటర్‌ ఫలితాల్లో గణనీయమైన ఉత్తీర్ణత సాధించింది. గతం కంటే అత్యధిక శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు ఆధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  


 Also Read :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా!
 
మే 12 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా ఫేయిలై విద్యార్థులు సబ్జెక్టులను బట్టి  ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు సప్లెమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించాల్సిందిగా బోర్డు తెలిపింది. ఏప్రిల్ 22 వరకు చివరి తేదీగా ప్రకటించింది. అలాగే సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగనున్నాయి.  

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!


ఈరోజు (శనివారం) ఉదయం సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా మంత్రి నారా లోకేష్  ఏపీ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి అత్యధికంగా పాస్‌ పర్సంటేజ్ నమోదు అవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. రెండో సంవత్సరంలో 83 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ప్రతీఏడు లాగే ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికదే పై చేయిగా నిలిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలికలు 71 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 64 శాతం ఉత్తీర్ణత పొందారు. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 81 శాతంతో బాలికలు ఉత్తీర్ణత పొందగా.. బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

Also Read :  అనుకున్నదే అయింది.. అఘోరీకి వర్షిణీకి పెళ్లైంది - వీడియో

Advertisment
Advertisment
Advertisment