AP: ఏపీ కేబినెట్ సమావేశం.. ఈ అంశాలపై కీలక చర్చ..! ఏపీ కేబినెట్ మరికాసేపట్లో సమావేశం కానుంది. రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కి కేబినెట్ ఆమోదం తెలపనుంది. పోలవరం ప్రాజెక్ట్పై అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించనుంది. By Jyoshna Sappogula 25 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి AP Cabinet: మరికాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కి కేబినెట్ ఆమోదం తెలపనుంది. పోలవరం ప్రాజెక్ట్ పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్పై అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించనుంది. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పై నిపుణుల కమిటీ రెండు సూచనలు చేసింది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతంలో రింగ్ ఫెన్సింగ్ చేస్తే సరిపోతుందని తొలుత నివేదిక ఇచ్చింది. తర్వాత భిన్నంగా డయాఫ్రమ్ వాల్కు సమాంతరంగా మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించడం ఉత్తమం అని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. కేంద్ర జలవనరుల శాఖ సైతం ఇదే అభిప్రాయానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై కేబినెట్ కేంద్రానికి ధన్యవాదాలు తెలుపనుంది. #ap-cabinet సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి