AP: నేను ఆ తప్పు చేయలేదు.. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు: జనసేన ఇంచార్జ్

వైసీపీ నాయకులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆదోని జనసేన ఇంచార్జ్ మల్లప్ప మండిపడ్డారు. ఇసుక అమ్మకాల్లో తాను డబ్బు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ దుష్ప్రచారం వెనుక ఎవరున్నారో తేలుస్తామన్నారు. తప్పు చేస్తుంటే చూస్తూ ఉండడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదన్నారు.

New Update
AP: నేను ఆ తప్పు చేయలేదు.. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు: జనసేన ఇంచార్జ్

Kurnool: ఇసుకను అధిక ధరకు అమ్ముతున్నట్లు తనపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని కర్నూలు జిల్లా ఆదోని జనసేన ఇంచార్జ్ మల్లప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. అవన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని.. వైసీపీ నాయకులు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read: రజనీకాంత్ వర్సెస్ దళపతి విజయ్..!

ఇసుక అమ్మకాల్లో తాను ఎలాంటి డబ్బు తీసుకోలేదన్నారు. ఈ విషయం ఎమ్మెల్యే పార్థసారధి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రీచ్ వద్దా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ దుష్ప్రచారం వెనుక ఎవరున్నారో తేలుస్తామన్నారు. ఆదోనిలో కూటమి నాయకులుగా ఏ తప్పు చేసిన అది అందరి బాధ్యత అన్నారు. తప్పు చేస్తుంటే చూస్తూ ఉండడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదని ఫైర్ అయ్యారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు