Anchor Shyamala : గుడివాడ గడ్డ అతనిదే.. ఎన్నికల ప్రచారమే అవసరం లేదు.. శ్యామల సంచలన వ్యాఖ్యలు..! గుడివాడలో అసలు ఎన్నికల ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నారు సినీ యాంకర్ శ్యామల. నూటికి నూరు శాతం కొడాలి నానినే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. గుడివాడ గడ్డ అంటే కొడాలి నాని అడ్డా అని ఎందుకంటారో నేడు తాను ప్రత్యక్షంగా చూశానన్నారు. By Jyoshna Sappogula 09 May 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Anchor Shyamala : విజయవాడ(Vijayawada) నందివాడ మండలంలో ఎమ్మెల్యే కొడాలి నాని, సినీ యాంకర్ శ్యామల(Shyamala) విస్తృతంగా ఎన్నికల ప్రచారం(Election Campaign) నిర్వహించారు. గ్రామంలో వీధి వీధినా ఎమ్మెల్యే కొడాలి నాని.. యాంకర్ శ్యామలకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పుట్టగుంట గ్రామంలో గడపగడప ప్రచారం చేశారు. సీఎం జగన్ కు మద్దతుగా.. ఎమ్మెల్యే కొడాలి నానిను గెలిపించాలంటూ ఓటర్లకు శ్యామల విజ్ఞప్తి చేశారు. Also Read: మంత్రి బొత్స వ్యాఖ్యలకు పురంధేశ్వరి మాస్ కౌంటర్..! ప్రచారంలో భాగంగా యాంకర్ శ్యామల మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నాని ఎన్నికల ప్రచారం చూస్తుంటే తనలో ఎంతో ఉత్సాహం నింపిందని, ప్రతి ఇంట్లో ఆయనను కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్నారన్నారు. గుడివాడలో అసలు ఎన్నికల ప్రచారం చేయాల్సిన అవసరం లేదని.. నూటికి నూరు శాతం గెలిచేది కొడాలి నానినే నని శ్యామల చెప్పారు. గుడివాడ గడ్డ అంటే కొడాలి నాని అడ్డా అని ఎందుకంటారో నేడు తాను ప్రత్యక్షంగా చూశానన్నారు. కొడాలి నాని ప్రజలతో మమేకమవుతున్న తీరు చూస్తుంటే.. ఆయన ఎంత గొప్పవాడొ అర్థమవుతుందని శ్యామల అన్నారు. Also Read: నెల్లూరులో రచ్చ..రచ్చ…పిడిగుద్దులు గుద్దుకున్న తెలుగు తమ్ముళ్లు..! ప్రజల సమస్యల పరిష్కారానికి నిజమైన లీడర్ లా కొడాలి నాని(Kodali Nani) కష్టపడుతున్నారన్నారు. నమ్ముకున్న ప్రజలకు మంచి చేయడం కోసం.. సీఎం జగనన్న ఎంతవరకైనా వెళ్తారని.. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటారని.. ఎంతమంది వచ్చినా అడ్డుకుంటారని శ్యామల పేర్కొన్నారు. మే 13వ తేదీన ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు తమ రెండు ఓట్లు వేసి.. మనకోసం నిలబడే నిజమైన లీడర్లను గెలిపించుకోవాలని యాంకర్ శ్యామల పిలుపునిచ్చారు. #kodali-nani #gudivada #anchor-shyamala సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి