ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై అమిత్ షా ఏమంటున్నారంటే ...

ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లు పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రసంగించారు. విపక్షాల తీరును తప్పుపట్టారు. మరో వైపు విపక్ష కూటమి సభ్యులు మణిపూర్ అంశంపై చర్చించాలని పట్టుపట్టారు. అనంతరం సభ నుంచి వాకెట్ చేశారు.

New Update
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై అమిత్ షా ఏమంటున్నారంటే ...

Amit Shah On Delhi Ordinance Bill : ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు (DELHI ORDINANCE) రాజ్యాంగబద్ధమేనని హోమ్ మంత్రి అమిత్ షా (AMIT SHAW) ప్రకటించారు. ఈ బిల్లుపై పార్లమెంటులో చర్చించజాలమన్న విపక్షాల వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనాలకు ఉద్దేశించినవని ఆయన వ్యాఖ్యానించారు. వివాదాస్పదమైన ఆర్డినెన్స్ స్థానే తెచ్చిన ఈ బిల్లును మొదట హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండ్మెంట్) బిల్లు-2023 పేరిట దీన్ని వ్యవహరిస్తున్నారు. ఈ బిల్లుపై సుదీర్ఘంగా మాట్లాడిన అమిత్ షా, ఢిల్లీకి సంబంధించినంతవరకు ఏ చట్టాన్నయినా సభ ఆమోదించేందుకు రాజ్యాంగం అధికారాన్ని ఇచ్చిందన్నారు. అలాగే హస్తినకు సంబంధించిన ఏ శాసనాన్నయినా పార్లమెంట్ కి తేవచ్చని సుప్రీంకోర్టు స్పష్టమైన వ్యాఖ్య చేసిందని గుర్తు చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాలకోసమే విపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయన్నారు. 249 అధికరణం కింద ఏ చట్టాన్నయినా తెచ్చేందుకు ఈ సభకు అధికారాలున్నాయని ఆయన చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారుల పోస్టింగులు, బదిలీల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ కే అధికారాలను కట్టబెట్టడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుందని చెప్పారు.

కాంగ్రెస్ నేతలు అధిర్ రంజన్ చౌదరి, శశిథరూర్, గౌరవ్ గొగోయ్, ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారని అమిత్ షా అన్నారు. రూల్ 72 కింద అధిర్ రంజన్ చౌదరి ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, ఢిల్లీ ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకునేందుకు, ప్రభుత్వ హక్కులను కాల రాచేందుకు ఈ బిల్లును తెచ్చారని ఆరోపించారు. అధికారుల సర్వీసులకు సంబంధించి అధికారాలు ఢిల్లీ ప్రభుత్వానికే ఉండాలన్నారు. ఆప్ తో సహా విపక్ష ఎంపీలు ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. మణిపూర్ అంశంపై చర్చ జరగాలంటూ ప్రతిపక్ష సభ్యులు పెద్దఎత్తున నినాదాలు చేయడంతో లోక్ సభ రేపటికి వాయిదా పడింది. మొదట ఈ ఉదయం కూడా సభలో ఇలాగే రభస జరగడంతో స్పీకర్ ఓంబిర్లా మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా వేశారు. ఆ తరువాత సభ మళ్ళీ ప్రారంభం కాగానే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ప్రభుత్వం ప్రతిపాదించింది.

రాజ్యసభలో విపక్షాల వాకౌట్

మణిపూర్ (MANIPUR) అంశంపై ప్రధాని మోడీ సభలో ప్రకటన చేయాలని రాజ్యసభలో విపక్ష కూటమి సభ్యులు మాటిమాటికీ డిమాండ్ చేస్తూ నినాదాలతో సభను హోరెత్తించారు. చైర్మన్ జగదీప్ ధన్ కర్ వీరి డిమాండును తిరస్కరించడంతో అందుకు నిరసన వ్యక్తం చేస్తూ వీరు సభ నుంచి వాకౌట్ చేశారు. ఒకవైపు సభ జరుగుతుండగానే మరోవైపు కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే (MALLIKHARJUNA KHARGE) బయట మీడియాతో మాట్లాడుతూ అతి ముఖ్యమైన మణిపూర్ పరిస్థితి గురించి ఉభయసభల్లో ప్రస్తావించేందుకు విపక్షాలను ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపించారు. తాము ఇంతగా డిమాండ్ చేస్తున్నా మోడీ
మణిపూర్ అంశంపై సభలో ఎందుకు ప్రకటన చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ఆప్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నదని ఖర్గే గుర్తు చేశారు. ఈ బిల్లుపై బుధవారం పార్లమెంటులో చర్చ జరిగే అవకాశాలున్నాయి. వివాదాస్పదమైన బిల్లులో ప్రభుత్వం మూడు అంశాలను తొలగించి ఒకదాన్ని కొత్తగా చేర్చింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ED raids : ఎంపురాన్ చిత్ర నిర్మాతకు షాక్‌...ఈడీచేతికి చిక్కిన రూ.1.5 కోట్లు

ఎంపురాన్‌తో వివాదం నెలకొన్న సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుుంది. ఎంపురాన్ చిత్ర నిర్మాతల్లో ఒకరైన గోకులం గోపాలన్ కార్యాలయంపై ఈడీదాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.తమిళనాడు, కేరళలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు చేపట్టింది.

New Update
ED seizes ₹1.5 crore in raids

ED seizes ₹1.5 crore in raids

ED raids  : ఎంపురాన్‌తో వివాదం నెలకొన్న సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుుంది. ఎంపురాన్ చిత్ర నిర్మాతల్లో ఒకరైన గోకులం గోపాలన్ కార్యాలయంపై ఈడీదాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.తమిళనాడు, కేరళలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు చేపట్టింది. L2-ఎంపురాన్ చిత్ర నిర్మాత గోకులం గోపాలన్ అలియాస్ ఏఎం గోపాలన్ కు చెందిన కంపెనీలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కోటిన్నర రూపాయలను స్వాధీనం చేసుకుంది. ఆయనకు చెందిన  శ్రీ గోపాలన్ చిట్ అండ్ ఫైనాన్స్ కో లిమిటెడ్ (గోకుల్ చిట్ ఫండ్ ఆర్థికఅవకతవలు జరిగాయన్న ఆరోపణలపై.. ఫెమా చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది.  ఈడీ అధికారులు కేరళ, తమిళనాడులోని గోపాలన్  ఆస్తుల వద్ద రెండు రోజులు తనిఖీలు నిర్వహించారు. 

Also Read: మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్....4 నెలల్లో 224 మంది సరెండర్

కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ రూ.1.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. ఈ కంపెనీలకు గోకులం గోపాలన్ అలియాస్ ఏఎం గోపాలన్ యాజమానిగా ఉన్నారు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) కింద రూ.1,000 కోట్ల విలువైన స్కాం దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. ఏఎం గోపాలన్ సంస్థ తమిళనాడు, కేరళ, తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, హర్యానాతో సహా అనేక రాష్ట్రాల్లో బ్రాంచెస్ ఉన్నాయి. మరోవైపు, గోకుల్ చిట్స్ లో తనిఖీలు ఇదేం మొదటిసారి కాదు. ఏప్రిల్ 2017లో ఆదాయపు పన్ను శాఖ మూడు రాష్ట్రాల్లోని గోకుల్ చిట్స్ ప్రాంగణంలో సోదాలు చేపట్టింది. పన్ను ఎగవేత కేసులో భాగంగా సోదాలు చేపట్టింది. ఐదేళ్లలో రూ. 1,107 కోట్లను వెల్లడించకపోవడం ద్వారా పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించకుండా ఉండవచ్చని ఆ సమయంలో అధికార వర్గాలు తెలిపాయి.

Also Read: జెలెన్‌స్కీ నగరంపై రష్యా దాడి.. 18 మంది మృతి

   అయితే L2 ఎంపురాన్  చిత్రాన్ని తెరకెక్కించడం వల్లే గోపాలన్ పై అక్రమకేసులు పెట్టి కేంద్రం వేధిస్తోందని కేరళ అధికార పార్టీ LDFతో పాటు UDF ఆరోపిస్తున్నాయి. కేరళ సాంస్కృతిక రంగం, కళాత్మక స్వేచ్ఛతో పాటు భావ ప్రకటన స్వేచ్ఛపై బీజేపీ దాడి చేస్తోందని దుయ్యబట్టాయి. కాగా L2 ఎంపురాన్  చిత్రంలో గుజరాత్  అల్లర్లకు సంబంధించిన సన్నివేశాలు ఉండటంపై వివాదాలు చెలరేగాయి. చిత్రంపై బీజేపీ, ఆరెస్సెస్  వంటి సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా చిత్రబృందం ఇప్పటికే క్షమాపణలు చెప్పింది. రాజకీయ వివాదాలకు సంబంధించిన సన్నివేశాలు తొలగిస్తామని స్పష్టం చేసింది. ఐతే కేరళ సీఎం పినరయి విజయన్  సహా చాలామంది విపక్ష నేతలు సినిమాకు మద్దతుగా నిలిచారు.

ఇది కూడా చూడండి: Earthquake: మరోసారి భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు- ఈసారి ఎక్కడంటే?

Advertisment
Advertisment
Advertisment