Ambajipeta Marriage Band OTT: ఓటీటీలోనూ ఆ బొమ్మ హిట్టే.. ఆహాలో ప్రస్తుతం ఆ సినిమా బ్యాండే మోగుతోంది!

చిన్న సినిమాగా విడుదలై మంచి సినిమాగా ప్రేక్షకుల ఆదరణ పొందిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా ఓటీటీలోనూ దూసుకుపోతోంది. ఆహా లో ఈ సినిమా వచ్చేసింది. సుహాస్ హీరోగా.. దుశ్యంత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. 

New Update
Ambajipeta Marriage Band OTT: ఓటీటీలోనూ ఆ బొమ్మ హిట్టే.. ఆహాలో ప్రస్తుతం ఆ సినిమా బ్యాండే మోగుతోంది!

Ambajipeta Marriage Band OTT: ఈ మధ్య వచ్చిన చిన్న సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమాని దుష్యంత్ కటికనేని రూపొందించారు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్.. టీజర్లతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన ఈ సినిమా ఆ నమ్మకాలకు తగ్గట్టుగానే పెద్ద హిట్ అయింది. పల్లెటూరి ప్రజల జీవనంతో కనెక్ట్ అయ్యేవిధంగా.. సునిశిత హాస్యంతో మేళవించి అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు తెరకెక్కింది.  ఈ సినిమాకి థియేటర్లలో విశేష స్పందన లభించింది. దాంతో సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. అయితే, ఎక్కువ రోజులు సినిమా థియేటర్లలో రన్ కాలేకపోయింది. కానీ, సినిమాకి మంచి బజ్ అయితే వచ్చింది. 

Also Read: దేశభక్తి నేపధ్యంలో ప్రేక్షకులకు గూస్ బంప్స్.. ఆపరేషన్ వాలెంటైన్ 

ఈ నేపథ్యంలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాను ఓటీటీAmbajipeta Marriage Band OTT)కి తీసుకువచ్చేశారు. హృద్యమైన కథాంశంతో రూపొందిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా చేజిక్కుంచుకున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాని మార్చి 1 నుంచి ఆహాలో చూడొచ్చని ప్రకటించారు. కానీ, ఆహా గోల్డ్ మెంబర్స్ కోసం ఒకరోజు ముందుగా నిన్ననే అంటే ఫిబ్రవరి 29 అర్థరాత్రి నుంచి అందుబాటులోకి తెచ్చేశారు. దీంతో చాలామంది ఈ సినిమాను చూశేశారు. ఆహా గోల్డ్ లో ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. సినిమా వ్యూయర్ షిప్ చాలా ఎక్కువగా రికార్డ్ అయింది. ఈరోజు నుంచి ఆహాలో అందరికీ అందుబాటులోకి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్(Ambajipeta Marriage Band OTT) అందుబాటులో ఉంటుంది. దీంతో సినిమా మరింత మందికి రీచ్ అవుతుందని.. అక్కడ కూడా మంచి ఆదరణ పొందుతుందని అంచనా వేస్తున్నారు. 

కాగా, సుహాస్ - దుష్యంత్ కాంబోలో వచ్చిన  'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు' ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్, వెంకటేష్ మహా సమర్పణలో ధీరజ్ నిర్మించారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించారు. ఇందులో శివానీ హీరోయిన్‌గా, శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ కీలకమైన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో శరణ్య పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. 

ఈ సినిమా ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు: 

Advertisment
Advertisment
తాజా కథనాలు