Alleti Maheshwar Reddy: బీజేపీ అధిష్టానంపై అలిగిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి TG: బీజేపీపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి అలిగినట్లు తెలుస్తోంది. వరద ప్రాంతాలను పరిశీలించేందుకు పార్టీ ఏర్పాటు చేసిన బృందానికి సారథ్యం అప్పగించకపోవడంతో ఆయన అసంతృప్తికి గురైనట్లు సమాచారం. అందుకే ఈరోజు వరద ప్రభావిత ప్రాంత పర్యటనకు ఆయన వెళ్లలేదని పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. By V.J Reddy 06 Sep 2024 in Latest News In Telugu ఆదిలాబాద్ New Update షేర్ చేయండి Alleti Maheshwar Reddy: బీజేపీ అధిష్టానంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అలిగినట్లు తెలుస్తోంది. పార్టీపై అలకతో ఇవాళ వరద ప్రభావిత ప్రాంత పర్యటనకు ఏలేటి వెళ్లలేదు. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు 2 బృందాలను రాష్ట్ర నాయకత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల ఆధ్వర్యంలో బృందాలు పరిశీలనకు వెళ్లనున్నాయి. ఈటల బృందంలో ఏలేటిని సభ్యుడిగా రాష్ట్ర నాయకత్వం చేర్చింది. కాగా ఈటల బృందంలో చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు మహేశ్వర్ రెడ్డి అనుచరులు. ఫ్లోర్ లీడర్ను సభ్యుడిగా ఎలా పంపిస్తారంటూ ఏలేటి వర్గం అధిష్టానాన్నిప్రశ్నిస్తోంది. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి మహేశ్వర్ రెడ్డి వర్గం తీసుకెళ్లింది. హై కమాండ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏలేటి అనుచరులు. ఏలేటి ఫీల్డ్ విజిటింగ్కు వెళ్లకపోవడంపై పార్టీలో చర్చ జోరందుకుంది. #alleti-maheshwar-reddy సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి