జ్ఞాన్‌వాపీ కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!

యూపీలోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేకు అలహాబాద్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

author-image
By Bhoomi
New Update
జ్ఞాన్‌వాపీ కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!

Gyanvapi Masjid Case: జ్ఞాన్‌వాపీ క్యాంపస్‌లో ఏఎస్‌ఐ సర్వేకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) తీర్పు వెలువరించింది. ఏఎస్ఐ సర్వే కొనసాగించేందుకు హైకోర్టు అనుమతించింది. అంతకుముందు, జూలై 27న జరిగిన విచారణలో, అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత, కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తదుపరి ఆదేశాల వరకు ASI సర్వేపై స్టే విధించింది.

అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రీతికర్ దివాకర్ అంజుమన్ ఇంజామియా మసీదు కమిటీ పిటిషన్‌ను విచారించారు. దీనిపై రెండు రోజుల పాటు హైకోర్టులో వాదనలు జరిగాయి. అన్ని పార్టీలు తమ అభిప్రాయాన్ని తెలిపాయి. ఏఎస్‌ఐ సర్వేపై ఓ వైపు పట్టుబడుతుండగా, మరోవైపు ఏఎస్‌ఐ సర్వేను ముస్లిం పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఐ అధికారులు కూడా కోర్టుకు హాజరయ్యారు. సర్వే వల్ల నిర్మాణానికి ఎలాంటి నష్టం వాటిల్లదని ఏఎస్‌ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అలోక్ త్రిపాఠి తెలిపారు.

వారణాసి జిల్లా కోర్టు ASI సర్వేను ఆమోదించింది. కాశీ విశ్వనాథ దేవాలయం సమీపంలోని మా శృంగార్ గౌరీ-జ్ఞాన్వాపి మసీదు కేసులో, వివాదాస్పద భాగాన్ని మినహాయించి మొత్తం జ్ఞానవాపి సముదాయంపై పురావస్తు పరిశోధనకు ఆదేశించింది. ఆగస్టు 4లోగా నివేదిక సమర్పించాలని ఏఎస్‌ఐని కోర్టు ఆదేశించింది. అయితే ఈ కేసులో అంజుమన్ ఇంజామియా మసీదు కమిటీ హైకోర్టులో అప్పీల్ చేసి ఏఎస్ఐ సర్వేపై స్టే విధించాలని డిమాండ్ చేసింది. దీనిపై కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.

మసీదు ప్రాంగణంలో శృంగార్ గౌరీ, ఇతర దేవతలను రోజువారీ పూజించే హక్కు డిమాండ్ తర్వాత తాజా జ్ఞానవాపి వివాదం తలెత్తింది. ఈ శిల్పాలు జ్ఞానవాపి మసీదు(Gyanvapi Masjid) వెలుపలి గోడపై ఉన్నాయి. 2021 ఆగస్టు 18న ఐదుగురు మహిళలు శృంగర్ గౌరీ ఆలయంలో రోజువారీ పూజలు, దర్శనం కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో వివాదం మొదలైంది. వాస్తవానికి, ఇంతకుముందు ఈ సముదాయాన్ని సంప్రదాయం ప్రకారం సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే పూజించేవారు, అయితే ఈ మహిళలు...ఇతర దేవతలకు ఎలా పూజలు నిర్వహిస్తున్నారో...ఇక్కడ కూడా అదే విధంగా రోజువారీ పూజలు నిర్వహించాలని...దేవతల ఆరాధనను అడ్డుకోవద్దని కోర్టును కోరారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భారీ వర్షం.. పిడుగులు పడి 13 మంది మృతి

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మృతుల కుటుంబాలకు సీఎం నితిశ్ కుమార్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.

New Update
13 killed in lightning strikes in four districts of Bihar

13 killed in lightning strikes in four districts of Bihar

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. దర్‌బంగా, బెగూసరాయ్ జిల్లాల్లో తొమ్మిది మంది పిడుగుపాటుకు గురై మృతి చెందారు. మధుబనీ జిల్లాలో ముగ్గురు చనిపోయారు. వీళ్లలో ఇద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రి, కూతురు. ఇక సమస్తిపుర్‌లో ఒక వ్యక్తి పిడుగుపాటు వల్ల మృతి చెందాడు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.    

Also Read: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. విపత్తు నిర్వహణ అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే బిహార్ ఆర్థిక సర్వే ప్రకారం చూసుకుంటే 2023లో పిడుగుపాటు వల్ల 275 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 Also read: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్‌..

ఇదిలాఉండగా భారత వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 9 నుంచి 12వ తేదీ దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలుల విస్తాయని.. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవించే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  

Also read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

 

 

Advertisment
Advertisment
Advertisment