Vishaka: ఓటింగ్ పై అవగాహన కార్యక్రమం..!

విశాఖలో అడిషనల్ రిటర్నింగ్ అధికారి విజయలక్ష్మి ఓటింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యతని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు . 18 ఏళ్ల పైబడిన వారంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

New Update
Vishaka: ఓటింగ్ పై అవగాహన  కార్యక్రమం..!

Vishaka: విశాఖలో అడిషనల్ రిటర్నింగ్ అధికారి విజయలక్ష్మి ఓటింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  కులం, మతం, అనే బేధం లేకుండా రాజ్యాంగం భారతీయులందరికీ ఓటు హక్కుని కల్పించిందని అడిషనల్ రిటర్నింగ్ అధికారి విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఎం విపి రైతు బజారులో ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ.. స్వీప్ కార్యక్రమాన్ని నగరంలో పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి నిర్వహించారు.

Also read: తిరుపతి ప్రజలకు బిగ్ రిలీఫ్.. ఒక్కసారిగా దంచికొట్టిన వర్షం..!

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. 18 ఏళ్ల పైబడిన వారంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు . ఆశించే మార్పు రావాలంటే శాసించే మీరంతా ఓటు వేయాలని కోరారు. మనకు ఇష్టమైన నాయకులు పోటీలో లేకుంటే "నోటా" బటన్ నొక్కి పైన ఉన్న వారెవరూ కాదు అని ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని వివరించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో రాబోయే 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

New Update
Rains

Rains

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment