Actress Gouthami: ఎన్నికలు తరముకొస్తున్న వేళ బీజేపీకి పెద్ద షాక్‌..రాజీనామా చేసిన నటి!

తమిళనాడులో బీజేపీ తరుఫున క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న గౌతమికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ..ఆమెకి పార్టీ అధిష్టానం టికెట్‌ ఇవ్వలేదు. అయినప్పటికీ ఆమె పార్టీకి అనుగుణంగానే పని చేశారు. కానీ ఇటీవల ఆమెకు తమిళనాడు నేతల నుంచి ఆమెకు కొన్ని చేదు అనుభవాలు ఎదురు అయ్యాయి. దీంతో ఆమె పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని ట్విట్టర్‌ ద్వారా ఆమె తెలిపారు.

New Update
Actress Gouthami: ఎన్నికలు తరముకొస్తున్న వేళ బీజేపీకి పెద్ద షాక్‌..రాజీనామా చేసిన నటి!

అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ తన దైన శైలిలో రాణిస్తున్న నటి గౌతమి. తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్ కి గురిచేసింది. సుమారు పాతికేళ్లుగా ఉన్న బీజేపీ కి ఆమె గుడ్‌ బై చెప్పింది. గౌతమి తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం తమిళనాట సెన్సేషన్‌ గా మారింది.

గత 25 సంవత్సరాలుగా ఆమె బీజేపీ తరుఫున ప్రతి పక్షాలకు  గళం గట్టిగా వినిపించేది. ఆమె రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటనే విషయం లోకి వెళ్తే..గౌతమిని పార్టీలోని ఓ వ్యక్తి కొన్ని విషయాల్లో నమ్మించి మోసం చేయడం వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

తమిళనాడులో బీజేపీ తరుఫున క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న గౌతమికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ..ఆమెకి పార్టీ అధిష్టానం టికెట్‌ ఇవ్వలేదు. అయినప్పటికీ ఆమె పార్టీకి అనుగుణంగానే పని చేశారు. కానీ ఇటీవల ఆమెకు తమిళనాడు నేతల నుంచి ఆమెకు కొన్ని చేదు అనుభవాలు ఎదురు అయ్యాయి. దీంతో ఆమె పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని ట్విట్టర్‌ ద్వారా ఆమె తెలిపారు.

ఆమె అభిమానులు, కార్యకర్తలతో ఆమె ఓ లేఖను కూడా పంచుకున్నారు. '' బీజేపీతో నాకు ఉన్న 25 ఏళ్ల అనుబంధం ముగిసింది. నా రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తమిళనాడు స్టేట్‌ చీఫ్‌ అన్నామలైకి పంపించాను అని ఆమె తన ట్విట్టర్ లో తెలిపారు.

అంతే కాకుండా ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. నా నుంచి డబ్బు, ఆస్తులు, కొన్ని డాక్యుమెంట్ల రూపంలో మోసం చేశారు. అంతేకాకుండా పార్టీలో కూడా ఏ నేత కూడా తనకు సపోర్ట్‌ చేయడం లేదని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా నాకు అన్యాయం చేసిన వ్యక్తికి కొందరు పార్టీ నేతలు సపోర్ట్‌ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

తన రాజీనామా అనంతరం రాసి లేఖలో గతంలో తాను జరిగిన చీటింగ్‌పై పోలీస్ కేసు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, న్యాయ వ్యవస్థ తనకు న్యాయం చేస్తుందనే ఆశాభావంతో ఉన్నాను అని గౌతమి వెల్లడించింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack-Tollywood: క్షమించరాని క్రూరమైన చర్య..ఉగ్రదాడిని ఖండించిన సినీ ప్రముఖులు!

పహల్గాం ఉగ్రదాడి పై టాలీవుడ్‌ ప్రముఖులు స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.మెగాస్టార్‌ చిరంజీవితో పాటు, తారక్‌,చరణ్‌, బన్నీ వంటి వారు సోషల్‌ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు.

New Update
tollywood

tollywood

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం లో జరిగిన ఉగ్రదాడి యావత్ భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కశ్మీర్ అందాలు చూడడానికి వచ్చిన పర్యాటకుల మీద ఉగ్రవాదులు మారణకాండకు తెగబడ్డారు. ప్రజల మీద పాశవికంగా దాడి చేశారు. ఆ ఘటనలో మొత్తం 28 మంది మరణించారు. ఈ విషాదం పట్ల  టాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ సంతాపాన్ని తెలియజేశారు.

''పహల్గం లో 26 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రదాడి‌ అత్యంత దారుణమైన చర్య. ఇది క్షమించరాని క్రూరమైన చర్య. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి కలిగిన నష్టం ఎవరూ పూడ్చలేనిది'' అని చిరంజీవి పేర్కొన్నారు. 

''పహల్గాం బాధితులను చూస్తుంటే నా గుండె బరువెక్కి పోతుంది. ఈ దాడిలో మరణించిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

'పహల్గాం టెర్రర్ ఎటాక్ వార్త విని షాక్ అయ్యాను. ఎంతో బాధ కలిగింది. ఈ తరహా ఘటనలకు మన సమాజంలో చోటు లేదు. దీనిని ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాలి. బాధిత కుటుంబాల కోసం ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను'' అని రామ్ చరణ్ పేర్కొన్నారు.

''పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ వార్త విని నా హృదయం ముక్కలైంది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా'' అని అల్లు అర్జున్ పోస్టు చేశారు. సాయి దుర్గా తేజ్, విష్ణు మంచు సహా పలువురు తెలుగు సినిమా ప్రముఖులు...‌‌ బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, సంజయ్ దత్, జాన్వీ కపూర్, సోనూ సూద్ తదితరులు ఈ దాడిని ఖండించారు.

Also Read: Pahalgam terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పుతిన్..!

Also Read: Pahalgam Attack: ప్రధాని టూర్ లో..జేడీ వాన్స్ ఇండియాలో..ముంబై తరహాలో ఉగ్రదాడి..టార్గెట్ ఎవరు?

tollywood | Pahalgam attack | latest-news | jr-ntr | telugu-news

Advertisment
Advertisment
Advertisment