Ambajipeta Marriage Band: 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' ఫస్ట్ టికెట్ రిలీజ్ చేసిన.. విజయ్ దేవరకొండ

కలర్ ఫోటో మూవీ ఫేమ్ సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్'. ఈ సినిమా ఫిబ్రవరి 2 న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఈ మూవీ ఫస్ట్ టికెట్ రిలీజ్ చేశారు. ఇప్పటికే సినిమాను చూసిన విజయ్ చాలా బాగుందని ప్రశంశించారు.

New Update
Ambajipeta Marriage Band:  'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' ఫస్ట్ టికెట్ రిలీజ్ చేసిన.. విజయ్ దేవరకొండ

Ambajipeta Marriage Band: సహాయనటుడిగా పలు పాత్రల్లో అలరించిన సుహాస్.. సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన కలర్ ఫోటో చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సుహాస్ కు ఫాలోయింగ్ కూడా పెరిగింది. కలర్ ఫొటోలో తన నటనతో మెప్పించిన సుహాస్.. ఆ తర్వాత రైటర్ పద్మ భూషణ్ సినిమాలో మరో సారి హీరోగా కనిపించారు. ఇక ప్రస్తుతం సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్'. దుష్యంత్ కటికనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

ఫస్ట్ టికెట్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

సినిమా విడుదల రేపే కానున్న నేపథ్యంలో.. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' మూవీ ఫస్ట్ టికెట్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సుహాస్ అండ్ మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు. ఇప్పటికే సినిమా చూసిన విజయ్ చాలా బాగుందని ప్రశంశించారు. ఖచ్చితంగా 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' ఘన విజయం సాదిస్తుందని చెప్పారు.

Also Read: Suhas Movie: ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది

publive-image

ఆసక్తికర విషయాలు చెప్పిన విజయ్

ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు మాట్లాడారు విజయ్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం కావడం చాలా సంతోషం.. 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' ఫస్ట్ టికెట్ రిలీజ్ ఆనందంగా ఉందని చెప్పారు. ఏదైనా సినిమా చూసేటప్పుడు నేను మధ్యలో బ్రేక్ తీసుకుంటాను.. కానీ ఈ మూవీ కంటిన్యూ గా చూసాను అంత క్యూరియస్ గా అనిపించింది. అందరు కూడా ఈ సినిమాను థియేటర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. మ్యూజిక్, ఆర్టిస్టుల అందరు అద్భుతంగా చేశారు. సుహాస్ ఎప్పటిలాగే సూపర్ గా చేశారు. హీరోయిన్ శరణ్య కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేసిందని తెలిపారు.

ధీరజ్ మొగిలినేని మహాయాన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్, GA2 పిక్చర్స్, బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ, జగదీశ్ ప్రతాప్ మూవీలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వాజిద్ బేగ్ పని చేయగా.. శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

publive-image

Also Read: Brahmamudi Today Episode: పరాయి అమ్మాయితో సంబంధం పై భర్తను నిలదీసిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు

Advertisment
Advertisment
తాజా కథనాలు