Nani : కాలినడకన ఫ్యామిలీతో తిరుమలకు న్యాచురల్ స్టార్ నాని..

టాలీవుడ్ హీరో నాని కాలినడకన తిరుమల చేరుకున్నారు. తన సతీమణి అంజన, తనయుడు అర్జున్‌తోపాటు తన కొత్త సినిమా హీరోయిన్ ప్రియాంక అరుళ్‌ మోహన్‌తో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

New Update
Nani : కాలినడకన ఫ్యామిలీతో తిరుమలకు న్యాచురల్ స్టార్ నాని..

Actor Nani : టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని కాలినడకన తిరుమల చేరుకున్నారు. తన సతీమణి అంజన, తనయుడు అర్జున్‌తోపాటు తన కొత్త సినిమా హీరోయిన్ ప్రియాంక అరుళ్‌ మోహన్‌తో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లారు. మార్గమధ్యలోనాని తన అభిమానులతో కాసేపు ముచ్చటించారు. పలువురుతో కలిసి ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Also Read : నెలలోపే ఓటీటీలోకి ‘మిస్టర్ బచ్చన్’.. స్ట్రీమింగ్ డేట్ అదేనా?

ఇక నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29 న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలు పెంచేసింది. నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. డి.వి.వి.దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో సాయి కుమార్, SJ సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు