Nagababu: టీటీడీ బోర్డ్ ఛైర్మన్గా నాగబాబు? AP: పార్లమెంట్ ఎంపీ సీటు త్యాగం చేసిన నాగబాబుకు కూటమి ప్రభుత్వం కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీటీడీ బోర్డ్ ఛైర్మన్గా నాగబాబును నియమించాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబును డిమాండ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. By V.J Reddy 06 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Nagababu: కొత్త ప్రభుత్వంలో నాగబాబుకు కీలక పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. టీటీడీ బోర్డ్ ఛైర్మన్గా నాగబాబు నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో తన అన్న నాగబాబుకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని పవన్ చంద్రబాబును కోరుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో నాగబాబు పోటీ చేయకుండా పార్లమెంట్ సీటు త్యాగం చేశారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక మంత్రి పదవులపై చంద్రబాబుతో పవన్ చర్చలు జరుపుతున్నారు. రాజ్యసభ స్థానాలు, నామినేటెడ్ పోస్టులపైనా ఫోకస్ చేస్తున్నారు. విజయవాడ దుర్గమ్మ గుడి ఛైర్మన్ పోస్టుకు జనసేన నేత బాడిత శంకర్ను సుజన, చిన్ని సిఫారసు చేయనున్నారు. పదేళ్లుగా జనసేనను నమ్ముకున్న వారందరికీ న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు పవన్. స్థానికసంస్థల్లోనూ పార్టీ శ్రేణులకు ప్రాధాన్యం కల్పించనున్నారు. #nagababu సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి