ACB Raids: HCAపై ఏసీబీ దాడులు

TG: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఉప్పల్ స్టేడియంలోని HCA పరిపాలనా భవనంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం.

New Update
ACB Raids: HCAపై ఏసీబీ దాడులు

ACB Raids on HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఉప్పల్ స్టేడియంలోని HCA పరిపాలనా భవనంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం. కాగా HCAలో నిధుల గోల్మాల్ జరిగినట్లు పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఈరోజు అసోసియేషన్ పై ఏసీబీ రైడ్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటె.. 2023 అక్టోబరు నెలలో HCAలో నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఉప్పల్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. 2019- 2022 మధ్య కాలంలో అపెక్స్‌ కౌన్సిల్‌ నేతృత్వంలో బీసీసీఐ నుంచి వచ్చిన ఫండ్స్, ఖర్చులు, టెండర్లు, కొటేషన్ల విషయంలో అవకతవకలు జరిగినట్లుగా ఫోరెన్సిక్‌ ఆడిట్‌ లో తేలింది. దీంతో 2019- 2022 మధ్య కాలంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్, ఉపాధ్యక్షుడిగా జాన్‌ మనోజ్, సెక్రటరీగా విజయానంద్, జాయింట్ సెక్రటరీగా నరేశ్‌ శర్మ, ట్రెజరర్‌గా సురేందర్‌ అగర్వాల్, కౌన్సిలర్‌గా అనురాధ ఉన్న వీరిపై త్వరలో ఏసీబీ అధికారులు విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: వయనాడ్ విషాదం.. మొత్తం మృతులు 1000కి పైనే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime : అన్నంలో మత్తు మందు కలిపి... వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ

హైదరాబాద్ కాచిగూడలో భారీ దోపిడీ జరిగింది. వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ.3కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇంట్లో పని మనుషులే ఈ దోపిడీకి పాల్పడ్డారు.

New Update
Massive theft

Massive theft

 TG Crime :  హైదరాబాద్ కాచిగూడలో భారీ దోపిడీ జరిగింది. వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ.3కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో ప్రముఖ పారిశ్రామికవేత్త హేమ్‌రాజ్‌ , అతడి భార్య మీనా దుగ్గర్‌ నివాసముంటున్నారు. ఇంట్లో పని మనుషులు వ్యాపారవేత్త హేమరాజు దంపతులకు రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి పెట్టారు. అది తిన్న దంపతులిద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో వారు నగలు, నగదు తీసుకుని పారిపోయారు.

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

కొద్ది రోజుల క్రితం వారు నేపాల్‌కు చెందిన దంపతులను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇటీవల వారి కొడుకు, కోడలు విదేశీ యాత్రకు వెళ్లడంతో హేమ్‌రాజ్, అతడి భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన పనివారు ఆదివారం రాత్రి భోజనంలో మత్తు మందు కలిపారు. వారు మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదుతో పాటు కారు తీసుకుని ఉడాయించారు. ప్రతి రోజూ వాకింగ్‌కు వెళ్లే  హేమరాజ్‌ సోమవారం వాకింగ్‌కు రాకపోవడంతో అతని స్నేహితుడు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. 

Also read: Murder case: కొడుకు అక్రమ సంబంధానికి బలైన తండ్రి.. వాడి పెళ్లం ఫొటోలు వాట్సాప్ స్టేటస్‌

దీంతో అనుమానం వచ్చిన అతని స్నేహితుడు ఇంటికి వచ్చాడు. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న హేమరాజు దంపతులను అతను ఆసుపత్రిలో చేర్పించారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి నుంచి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన పని మనుషులు (నేపాలి దంపతులు) కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Also read: wife harassment: మరో భార్యా బాధితుడు బలి.. ‘నా అస్తికలను డ్రైనేజీలో కలపండి’

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు