Delhi Ordinance Bill : ఆందోళనల నడుమే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు లోకసభ ఆమోదం...!!

విపక్షాల ఆందోళనల మధ్యే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు (Delhi Ordinance Bill) 2023కి లోకసభ ఆమోదం తెలిపింది. గురువారం సాయంత్రం మూజువాణి ఓటుతో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో విపక్షాలు లోకసభ నుంచి వాకౌట్ చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సుశీల్ కుమార్ రింకూ సెషన్ మొత్తానికి సస్పెండ్ అయ్యారు.

New Update
Delhi Ordinance Bill : ఆందోళనల నడుమే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు లోకసభ ఆమోదం...!!

Delhi Ordinance Bill : విపక్షాల గందరగోళం మధ్యే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు (Delhi Ordinance Bill)కు ఆమోదం తెలిపింది లోకసభ. గురువారం సాయంత్రం మూజువాణి ఓటు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం పొందింది. విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేయడంతో పార్లమెంట్ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు విపక్షాలు కూడా బిల్లుపై చర్చల్లో పాల్గొని.. అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అనంతరం కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. విపక్షాల అభ్యంతరాలకు అమిత్ షా సమాధానం ఇచ్చారు. మూజువాణి ఓటు జరిగింది. విపక్షాల ఆందోళన నడుమే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లకు ఆమోదం లభించింది. ఆప్ ఎంపీ రింకూ సింగ్ పేపర్‌ను చించి స్పీకర్ కుర్చీ వైపు విసిరారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సుశీల్ కుమార్ రింకూ చైర్‌ను అవమానించినందున సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఎంపీ సుశీల్ కుమార్ రింకూ సెషన్ మొత్తానికి సస్పెండ్ అయ్యారు. శుక్రవారం రాజ్యసభ ముందుకు బిల్లు చర్చకు రానుంది.

లోక్‌సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు  (Delhi Ordinance Bill)ఆమోదంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. 'ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తామని బీజేపీ ప్రతిసారీ హామీ ఇచ్చింది. 2014లో తాను ప్రధాని అయితే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తానని నరేంద్ర మోదీ స్వయంగా చెప్పారు. "కానీ ఈరోజు ఈ వ్యక్తులు ఢిల్లీ ప్రజలను వెన్నుపోటు పొడిచారు. ఇకమీదట ప్రధాని మోదీని ఎవరూ నమ్మవద్దు" అంటూ ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి మే 19న కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇది ఢిల్లీలోని గ్రూప్ ఎ అధికారుల బదిలీ పోస్టింగ్ క్రమశిక్షణా చర్యలకు సంబంధించినది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన కొద్ది రోజులకే ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారు. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం శాంతిభద్రతలు, పోలీసు, భూమి వ్యవహారాలు మినహా ఇతర సేవలపై నియంత్రణను కలిగి ఉంటుంది. అయితే ఈ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీ మొదట్నుంచీ తీవ్రంగా వ్యతిరేకించింది.

అమిత్ షా కీలక వ్యాఖ్యలు:
పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు తమ కూటమి గురించి కాకుండా ఢిల్లీ ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించాలన్నారు. గతంలో జవహర్ లాల్ నెహ్రూ, అంబేద్కర్, సర్దార్ వల్లాభాయ్ పటేల్, రాజేంద్రప్రసాద్ వంటి నేతలు కూడా ఢిల్లీకి రాష్ట్ర హోదాను వ్యతిరేకించినట్లు తెలిపారు. మీ కూటమిలో ఉన్నారన్న కారణంతో ఢిల్లీలో జరుగుతున్న అవినీతికి మద్దతు ఇవ్వద్దంటూ అన్ని పార్టీలను కోరుతున్నాను అని అన్నారు. ఏ కూటమి ఉన్నప్పటికీ రాబోయేది మోదీ ప్రభుత్వమే అని పేర్కొన్నారు.

కాగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారులు ఎవరి నియంత్రణలో ఉండాలన్న అంశంపై గత కొన్నాళ్లుగా కేంద్రం వర్సెస్ ఆప్ మధ్య వాగ్వాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు. 

New Update
india

Laser Weapon

భారత దేశానికి చెందిన డీఆర్డీవో మరో కొత్త ప్రయోగం చేసింది. భారతదేశానికి కొత్త అస్త్రాన్ని అందించింది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో మొదటిసారి పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది. దీనికి సంబంధించిన  వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఒక వాహనంలో ఈ లేజర్ ఎనర్జీని వెపన్ ను అమర్చారు. దీనికి ఎంకే 2(ఏ) ల్యాండ్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఇది యూఏవీ, డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతో పాటు నిఘా సెన్సార్‌లను పనిచేయకుండా చేసింది. దీనిద్వారా.. లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్‌ చేరిందని డీఆర్డీవో తన ట్వీట్ లో రాసింది. అయితే ఇది కేవలం ప్రారంభమైనని..ఇలాంటివి మరిన్ని డీఆర్డీవో తయరాు చేసేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇలాంటి ఆయుధాలను ప్రదర్శించాయి. ఇజ్రాయెల్ కూడా పని చేస్తోందని..మనది నాలుగో దేశమని ఆయన అన్నారు. 

 

 today-latest-news-in-telugu | army

 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

Advertisment
Advertisment
Advertisment