Crime News: ఏపీలో యువతి దారుణ హత్య.. ఘోరంగా కొట్టి!

బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో దారుణం చోటుచేసుకుంది. రైల్వే పట్టాల సమీపంలో యువతి మృతదేహం లభ్యమయింది. యువతిని అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు.. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రి అనిత ఆదేశం ఇచ్చారు.

New Update
Crime News: ఏపీలో యువతి దారుణ హత్య.. ఘోరంగా కొట్టి!

Bapatla: బాపట్ల జిల్లా చీరాల (Chirala) మండలం ఈపూరుపాలెంలో దారుణం చోటుచేసుకుంది. రైల్వే పట్టాల సమీపంలో యువతి మృతదేహం లభ్యమయింది. యువతిని అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. డెడ్ బాడీని చూసిన స్థానికులు ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. యువతి ఒంటి పైన కొట్టిన దెబ్బలు ఉన్నట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్.. బాధిత యువతి నెల్లూరు జిల్లా వాసిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: అసెంబ్లీలో ఆసక్తికర అంశాలు.. జగన్ సభలోకి వచ్చి కూర్చోగానే ఎమ్మెల్యేలు ఏం చేశారంటే?

ఈ హత్యపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu).. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. వెంటనే ఘటన ప్రాంతానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవాలని సూచించారు. ప్రభుత్వం తరపున మృతురాలు కుటుంబానికి అండగా ఉండాలన్న సీఎం.. నిందితులను తక్షణమే అరెస్టు చేసి వేగవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. దర్యాప్తులో అలసత్వం లేకుండా..జాప్యం జరగకుండా చూడాలని హెచ్చరించారు. సిఎం ఆదేశాలతో హత్య జరిగిన ఈపూరు పాలెం హోంమంత్రి అనిత బయలు దేరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు