Kottagudem: కళ్యాణానికి ముందే కాటికి.. ట్రాక్టర్ బోల్తాపడి కాబోయే జంట మృతి!

మరికొన్ని రోజుల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోబోయే యువ జంటను మృత్యువు కబలించింది. రాఖీ పండుగరోజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తుమ్మలచెరువు, కమలాపురం గ్రామాలకు చెందిన ప్రసాద్, నాగమణి ట్రాక్టర్ బోల్తాపడి చనిపోయారు. ఈ ఘటన రెండు ఊర్లలో విషాదం నింపింది.

New Update
Kottagudem: కళ్యాణానికి ముందే కాటికి.. ట్రాక్టర్ బోల్తాపడి కాబోయే జంట మృతి!

Kottagudem: మరికొన్ని రోజుల్లో మూడుముళ్ల బంధంతో ఒక్కటికాబోయే జంటను కాలం కాటేసింది. ఎన్నో ఆశలతో భవిష్యత్తును కలలు కంటూ అప్యాయంగా నడుచుకుంటున్న ఇరుకుంటుంబాల మధ్య ఊహించని పెను విషాదం చోటుచేసుకుంది. రాఖీ పండుగపూట తోబుట్టువులతో ఆనందంగా ఉందామనుకుని ఆరాటపడ్డ వారి జీవితాలను మృత్యువు కబళించింది. ఈ ఘటన స్థానికులతోపాటు జనాలను కలిచివేయగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన కృష్ణయ్య, ఆదిలక్ష్మి దంపతుల రెండో కుమారుడు తాటి ప్రసాద్‌ (25) ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. అయితే ఇటీవలే ములకలపల్లి మండలం కమలాపురం గ్రామానికి చెందిన పత్రి నాగమణితో పెళ్లి కుదిరింది. వ్యవసాయ పనులు పూర్తి కాగానే ఎంగేజ్ మెంట్, మ్యారేజ్ డేట్ పెట్టుకుందామని ఇరు కుటుంబాల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు నడుస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం!

ఈ క్రమంలోనే నాగమణి నాగమణికి తండ్రి లేకపోవడంతో వారి వ్యవసాయ పనులు చూస్తున్నాడు ప్రసాద్. ఇందులో భాగంగానే తన ట్రాక్టర్‌ తీసుకొని నాగమణి ఇంటికి వెళ్లిన ప్రసాద్.. రాఖీ పండుగ కావడంతో రాత్రి పూట తన ఇంటికి బయలుదేరాడు. అయితే అప్పటికే కొంత దూరం వెళ్లిన ప్రసాద్ కోసం మరొకరి సాయంతో బైక్ పై వెళ్లిన నాగమణి.. పొద్దు పోయిందని, ఉదయం వెళ్లాలని కోరింది. దీంతో ప్రసాద్, నాగమణి కలిసి అదే ట్రాక్టర్ పై తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే కొత్తూరు వద్ద వారి ట్రాక్టర్‌ అనుకోకుండా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రసాద్, నాగమణి అక్కడికక్కడే దుర్మరణం చెందడంతో ఇరు గ్రామాల్లో విషాదం నెలకొంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment