Kuala Lumpur: కౌలాలంపూర్లో మురుగు కాల్వలో పడి కుప్పం మహిళ గల్లంతు! ప్రమాదవశాత్తు ఫుట్పాత్ కుంగి మురుగుకాల్వలో పడిపోవడం వల్ల ఏపీ కుప్పానికి చెందిన విజయలక్ష్మి అనే మహిళ గల్లంతయ్యింది. విజయలక్ష్మి తన భర్త, కుమారుడితో కలిసి కౌలాలంపూర్లో పూసల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. అధికారులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. By Bhavana 24 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Kuala Lumpur: మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో మురుగు కాల్వలో పడి తెలుగు మహిళ గల్లంతయ్యింది. ప్రమాదవశాత్తు ఫుట్పాత్ కుంగి మురుగుకాల్వలో పడిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన మహిళను చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన విజయలక్ష్మిగా గుర్తించారు. అనిమిగామిపల్లెకు చెందిన విజయలక్ష్మి తన భర్త, కుమారుడితో కలిసి కౌలాలంపూర్లో పూసల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వీరు వెళ్తున్న మార్గంలో ఫుట్పాత్ కుంగడంతో విజయలక్ష్మి ఒక్కసారిగా మురుగు కాల్వలో పడి గల్లంతైంది. అదృష్టవశాత్తూ ఆమె భర్త, కుమారుడు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న మలేషియా అధికారులు గల్లంతైన మహిళ కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాద విషయం స్థానిక ఎమ్మెల్సీ శ్రీకాంత్కు తెలియడంతో బాధిత కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించారు. అలాగే విషయాన్ని స్థానిక నేతలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లారు. Also Read: తెలంగాణలో నాలుగు రోజుల పాటు వానలే..వానలు..ఆ జిల్లాలకు..! #kaulal-lampur #malasiya #kuppam #ap సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి