AP : సొంత జిల్లాలో సీఎం జగన్.. తిరగబడ్డ వైసీపీ నేతలు!
ప్రొద్దుటూరులో వైసీపీ అసమ్మతి నేతల ఆత్మీయ సమావేశంలో ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు దర్శనమివ్వడం హాట్ టాపిక్ గా మారింది. స్థానిక ఎమ్మెల్యే రాచమల్లుకు మద్ధతు ఇవ్వబోమని వైసీపీ నాయకులు తేల్చి చెప్పారు.
Kadapa : ప్రొద్దుటూరు(Proddutur) లో వైసీపీ(YCP) అసమ్మతి నేతల ఆత్మీయ సమావేశంలో ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించగా.. స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వచ్చే ఎన్నికల్లో మద్ధతు ఇవ్వలేమని, భవిష్యత్తు కార్యచరణను త్వరలో వెల్లడిస్తామన్నారు.
సమావేశంలో టీడీపీ నేతలు..
అయితే ఈ సమావేశంలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సోదరుడు రాఘవ రెడ్డి దర్శనమివ్వడం చర్చనీయాంశమైంది. అంతేకాదు ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీ(TDP) లో చేరిన లక్ష్మి రెడ్డి సైతం ఈ కార్యక్రమానికి హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే నంద్యాల ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి(Nandyala Raghava Reddy) వైసీపీ అసమ్మతి నేతలతో మాట్లాడం ఆసక్తికరంగా మారింది. దీంతో వైసీపీ నేతలంతా మూకుమ్మడిగా టీడీపీలోకి వెళతారా? లేదంటూ టీడీపీకి మద్దతు ఇస్తారా? అనే ఆంశం ప్రొద్దుటూర్ రాజకీయాల్లో హాట్ హాట్ టాపిక్(Hot Topic) గా మారింది. మరోవైపు ప్రజామోదం లేని నేతలను రాబోయే ఎన్నికల్లో నిలబెట్టవద్దని ఆ పార్టీ హై కమాండ్కు అసమ్మతి నేతలు హెచ్చరిస్తున్నారు.
Tirumala High Alert : పహల్గాంలో ఉగ్రదాడి..తిరుమలలో హై అలర్ట్
జమ్మూకాశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా హై అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. దాడుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమతిలోనూ హై అలర్ట్ ప్రకటించారు.
Tirumala High Alert : జమ్మూకాశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా హై అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. దాడుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమతిలోనూ హై అలర్ట్ ప్రకటించారు. కొండపై భద్రతను విజిలెన్స్ సిబ్బంది కట్టుదిట్టం చేశారు. కశ్మీర్లోని పహల్గాం దాడి నేపథ్యంలో తిరుమలలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
Also Read: BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్! కొండపై సెక్యూరిటీ కట్టుదిట్టం చేసినట్లు టీటీడీ వెల్లడించింది. తిరుమల ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే అన్ని వాహనాలను, భక్తులను క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. మొదట అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్డులో పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలను, అందులోని లగేజీని సైతం వదలకుండా తనిఖీ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ చెబుతోంది. శ్రీవారి ఆలయ పరిసరాలలోనూ భద్రతను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. నిఘవర్గాల హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం తిరుమలలో కూడా భద్రత కట్టుదిట్టం చేసింది.
తిరుమలకు అలిపిరి మీదుగా వాహనాలతో పాటుగా కాలినడకన వచ్చే రెండు మార్గాలు ఉన్నాయి. అలాగే శ్రీవారి మెట్టు నడకమార్గం ఉంది. తిరుమలకు వాహనాల్లో వెళ్లే భక్తుల లగేజీని అలిపిరి సప్తగిరి చెకింగ్ పాయింట్ దగ్గర తనిఖీలు చేస్తారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గంలో వెళ్లే భక్తుల లగేజీని కూడా చెక్ చేసిన తర్వాతే అనుమతిస్తారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండటం, కాశ్మీర్ ఉగ్రదాడితో తిరుమలలో కూడా హై అలర్ట్ ప్రకటించారు.. దేశంలో మరోసారి ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో తిరుమలలో భద్రతలను కట్టుదిట్టం చేశామన టీటీడీ వర్గాలు స్పష్టం చేశాయి.
మరోవైపు ఆక్టోపస్ దళం కూడా అప్రమత్తమైంది. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి.. భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆక్టోపస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు, ఆలయాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఏటా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఆక్టోపస్ టీమ్ తిరుమల శ్రీవారి ఆలయంలో మాక్ డ్రిల్ చేసింది. ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా, భద్రతా, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరిస్తారు. గతేడాది మార్చిలో తిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అలాగే తిరుమల ఆలయం దగ్గర కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.. 24 గంటలు సాయుధ బలగాల పహారాలో కట్టుదిట్టమైన నిఘా ఉంటుంది. మొత్తం మీద కాశ్మీర్ ఉగ్రదాడి ప్రభావం తిరుమలపై కూడా కనిపించింది.. ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యల్లో భాగంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.