ప్రాక్టీస్ సెషన్ లో అభిషేక్ నాయర్ తో గొడవపడిన హార్థిక్!

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా కొత్త కోచ్‌ అభిషేక్ నాయర్ తో గొడవపడ్డాడని ఇంటర్నెట్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. శ్రీలంక పర్యటనలో భాగంగా పల్లెకలే లో ప్రాక్టీస్ చేస్తుండగా హార్థిక్ కొట్టిన షాట్ వల్ల ఇద్దరి మధ్య వివాదం తలెత్తిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

New Update
ప్రాక్టీస్ సెషన్ లో అభిషేక్ నాయర్ తో గొడవపడిన హార్థిక్!

ఆగస్టు 27న భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. భారత జట్టు మంగళవారం పల్లెకలే స్టేడియంలో శిక్షణ ప్రారంభించింది. కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు ఇతర కోచ్‌లు శిక్షణను పర్యవేక్షించారు. అయితే శిక్షణ సమయంలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

శిక్షణ సమయంలో హార్దిక్ కోచ్ గౌతం గంభీర్‌తో చాలాసేపు మాట్లాడాడు. ఆ తర్వాత కొత్త అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ పర్యవేక్షణలో హార్దిక్ బ్యాటింగ్ చేశాడు.ఇద్దరి మధ్య సంభాషణ సమయంలో, హార్దిక్ ఓ షాట్ కొట్టి అది బౌండరీ అని నాయర్ కు చెప్పాడు. అయితే దీనికి అభిషేక్ నాయర్ అంగీకరించలేదు. అక్కడ ఫీల్డర్‌ని ఉంచుతానని చెప్పాడు.ఫీల్డర్  ఖచ్చితమైన స్థానం ఎక్కడ అని హార్దిక్ నాయర్‌ని అడిగాడు. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ దగ్గరలో ఉన్న ఓ రిపోర్టర్‌ను చూపిస్తూ అక్కడని నాయర్ చెప్పాడు.

ఈ యాంగిల్‌లో బంతి వెళ్లింది కాబ్టట్చి అక్కడ ఫీల్డర్ ఉన్నా బౌండరీకి వెళ్లేదని హార్దిక్ అభిషేక్ నాయర్ ను వాదించాడు. దీని పై వివరణ కోసం ఇద్దరూ కలసి ఆ విలేకరి వద్దకు వెళ్లారు. పాండ్యా కొట్టిన ఆ షాట్ బౌండరీకి ​​వెళ్తుందా అని నాయర్ విలేఖరిని ప్రశ్నించాడు. దానికి అతను, 'మీ ఫీల్డర్‌ని ఇక్కడ ఆపేసినా, హార్దిక్ పాండ్యా షాట్ బౌండరీకి ​​పోయేది' అని చెప్పాడు.ఈ సమాధానానికి హార్దిక్, నాయర్ ఇద్దరూ నవ్వుకున్నారు. ఇద్దరి మధ్య జరిగిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ఇప్పుడు ఇంటెర్నెట్ లో చక్కర్లు కొడుతుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

శారీరకంగా, మానసికంగా భర్త వేధింపులు.. భరించలేక!

కరీంనగర్‌లో ఓ వివాహిత మహిళ భర్త, అత్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. హిమబిందు అనే మహిళకి రమేశ్‌తో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తునే ఉన్నాడు. ఈ క్రమంలో హిమబిందు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

New Update
Telangana Crime

Telangana Crime Photograph: (Telangana Crime )

భర్త, అత్త వేధింపులు భరించలేక వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన హన్ముకొండలో చోటుచేసుంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ పట్టణానికి చెందిన హిమబిందు(34)ను ఎల్కతుర్తి మండలానికి చెందిన శ్రీరామోజు రమేశ్​ చారికి ఇచ్చి 16 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఈ 16 ఏళ్ల నుంచి రమేశ్ శారీరకంగా, మానసికంగా వేధిస్తూనే ఉన్నాడు. 

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

వేధింపులు భరించలేక..

ఎన్నో సార్లు గ్రామ పంచాయతీ వరకు వీరి గొడవ వెళ్లింది. అయినా కూడా రమేశ్ ప్రవర్తలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో హిమబిందు రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. మళ్లీ పంచాయితీ పెట్టి అత్తవారింటికి తీసుకొచ్చారు. మళ్లీ ఇంట్లో గొడవ జరగడంతో మనస్తాపం చెంది హిమబిందు ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త, అత్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

ఇదిలా ఉండగా ఇటీవల వివాహం జరిగిన 22 రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హాజీపూర్ మండలం కటికనపల్లి గ్రామానికి చెందిన కంది కవిత- శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కాగా చిన్న కూతురు శృతిని పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఘర్షకుర్తి సాయికి ఇచ్చి గత నెల16న వివాహం జరిపించారు.

ఇది కూడా చూడండి: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

పెళ్లి జరిగిన వారం రోజుల తర్వాత నుంచి భర్త సాయితో పాటు అత్త మామ లక్ష్మి, శంకరయ్య మానసికంగా ఇబ్బంది పెడుతూ పెళ్లికి ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయిందని ఈ మొత్తాన్ని మీ తల్లిదండ్రుల నుండి తేవాలని శ్రుతిని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దీంతో ఆ నూతన వధువు బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

Advertisment
Advertisment
Advertisment