/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/bike.jpg)
Hyderabad: రంగారెడ్డి జిల్లాలో బాలుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది. జిల్లెలగూడకు చెందిన టిల్లు అనే బాలుడు నిన్న మధ్యాహ్నం ట్యూషన్కెళ్లి కనిపించకుండా పోయాడు. బాలుడి మిస్సింగ్పై ఆందోళన చెందిన తల్లిదండ్రులు మీర్పేట్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానిక సీసీ ఫుటేజ్ పరిశీలించగా.. గుర్తు తెలియని వ్యక్తి బాలుడిని బైక్పై తీసుకెళ్లిన దృశ్యాలు కనిపించాయి. సీసీ ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.