AP : పోలీసుల బెదిరింపులకు యువకుడు బలి..! విశాఖలో పోలీసుల బెదిరింపులకు యువకుడు బలైనట్లు తెలుస్తోంది. రోహిత్ అనే యువకుడు లాస్య అనే మైనర్ని ప్రేమిస్తున్నాడని కంచరపాలెం పోలీసులు అతడిని పిలిపించి కొట్టారని, గంజాయి కేసులు పెడుతామని బెదిరించడంతో మనస్థాపం చెందిన రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని బాధిత తల్లి ఆరోపిస్తోంది. By Jyoshna Sappogula 23 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Police Harassment : విశాఖ (Visakha) లో పోలీసుల బెదిరింపులకు యువకుడు బలైనట్లు తెలుస్తోంది. రోహిత్ అనే యువకుడు లాస్య అనే మైనర్ని ప్రేమిస్తున్నాడని కంచరపాలెం పోలీసులు అతడిని స్టేషన్ కు పిలిపించి కొట్టారని.. గంజాయి (Ganja) కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం అని అబ్బాయిని బెదిరించడంతో మనస్థాపానికి చెందిన రోహిత్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య (Suicide) కు పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రోహిత్ మృతి చెందాడు. దీంతో పోలీసులు బెదిరించడం వల్లే మా అబ్బాయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని బాధిత తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. Also Read : వరాలే ఎక్కువ.. వాతలు తక్కువే.. బడ్జెట్ ప్రధానాంశాలు ఇవే #visakha #police-harassment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి