New Delhi: కార్ పార్కింగ్ కోసం కొట్టుకున్న ఇరుగుపొరుగు..ఆరుగురు అరెస్ట్

కొన్నాళ్ళ క్రితం రెండు ఇళ్ళ మధ్య కార్ పార్కింగ్ గొడవ అనే కాన్సెప్ట్‌తో ఓ సినిమా వచ్చింది గుర్తుందా. అచ్చం అలాంటి గొడవే నిన్న న్యూ ఢిల్లీలోని నోయిడాలో జరిగింది. కానీ అది కాస్తా పెద్దది అయి కొట్టుకునే వరకు వెళ్ళింది. వివరాలు కింద చదివేయండి.

New Update
New Delhi: కార్ పార్కింగ్ కోసం కొట్టుకున్న ఇరుగుపొరుగు..ఆరుగురు అరెస్ట్

Car Parking Dispute: ఢిల్లీలోని నోయడాలో కారు పార్కింగ్ స్థలం విషయంలో రెండు కుటుంబాల మధ్య తగాదా హింసాత్మకంగా మారింది. ఎప్పటి నుంచో ఇరుగు, పొరుగున ఉంటున్నారు. ఒకరికి ఒకరు బాగా తెలిసిన వారే. కానీ కారు పార్కింగ్ విషయంలో గొడవపడి రచ్చ రచ్చ చేశారు. నోయిడాలోని సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 72లో ఈ ఘటన జరిగింది. ఇక్కడే నివాసం ఉండే రాజీవ్ చౌహాన్, నితిన్ మధ్య కార్ పార్కింగ్ వివాదం జరిగింది. నితిన్ తరుఫు వ్యక్తులు మొదట రాజీవ్ చౌహాన్ పై దాడి చేశారు. ఆ తరువాత రాజీవ్ కొడుకులు నితిన్ కారును ధ్వంసం చేశారు. కర్రలు, రాడ్లు, క్రికెట్ బ్యాట్లతో కారు అద్దాలను పగులగొట్టారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల్లో మహిళల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది.

చివరకు ఈ గొడవ పోలీసుల వరకు వెళ్ళింది. గొడద కాస్తా కొట్లాటకు దారి తీయడంతో ఎంటర్ అయిన పోలీసులు దీనిపై కేసు నమోదు చేయడమే కాకుండా ఆరుగురిని అరెస్ట్ కూడా చేశారు. ఇందులో ఒక మైనర్ కూడా ఉన్నారు. ఈ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read: Andhra Pradesh: వ్యవసాయ మోటార్లు దొంగతనం చేస్తున్న దొంగల అరెస్ట్.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vijayashanthi Vs Revanth: రేవంత్ రెడ్డికి షాకిచ్చిన విజయశాంతి.. సంచలన ట్వీట్!

మనిషి తన పద్ధతి మార్చుకోవడం లేదు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నిర్మూలించుకుంటూ పోతున్నాడు.. అంటూ ధరిత్రి దినోత్సవం సందర్భంగా విజయశాంతి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. HCU భూముల విషయంలో రేవంత్ టార్గెట్ గా ఆమె ఈ పోస్ట్ చేశారన్న చర్చ సాగుతోంది.

New Update

ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈ నెల 22న సోషల్ మీడియా వేదికగా ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన పోస్ట్ నెట్టింట ఆసక్తికరంగా మారింది. అనంతమైన ఈ విశ్వంలో మనిషికి ఆవాసయోగ్యమైన ఏకైక గ్రహం భూమి మాత్రమే. ఇక్కడ ప్రకృతి ప్రసాదించిన వనరుల్ని సరిగా వినియోగించుకుంటేనే.. మనిషి మనుగడ సాఫీగా సాగుతుంది. ఆ వనరుల్లో దేన్ని దుర్వినియోగం చేసినా.. సమస్త మానవాళి జీవనం అస్తవ్యస్తం అవుతుంది. ఈ విషయం తెలిసినప్పటికీ.. మనిషి తన పద్ధతి మార్చుకోవడం లేదు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నిర్మూలించుకుంటూ పోతున్నాడు. పరిశ్రమల పేరుతో.. గాలి, నీటిని కాలుష్యంలో ముంచెత్తుతున్నాడు. సహజ వనరుల్ని అవసరానికి మించి వినియోగిస్తున్నాడు.

తన స్వార్థంతో మొత్తం ప్రకృతి స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. ఇంత చేస్తుంటే.. ప్రకృతి ఊరుకుంటుందా..? భూకంపాలు, సునామీలు, వరదలు, కరువులతో హెచ్చరికలు చేస్తూనే ఉంది. కొన్ని సార్లు.. వైరస్‌ల రూపంలోనూ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో భూమి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేస్తోంది.. ఇకనైనా మారుదాం.. ప్రకృతి వనరుల్ని కాపాడుకుందాం. అందరికీ ప్రపంచ ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ తన X ఖాతాలో విజయశాంతి పోస్ట్ పెట్టారు.

అయితే... విజయశాంతి ట్వీట్‌ పై తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. HCU వివాదం నేపథ్యంలో రేవంత్‌కు విజయశాంతి గట్టి కౌంటర్‌ ఇచ్చారని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ ఇన్‌ఛార్జ్‌ కూడా HCU భూములపై రియాక్ట్‌ కాగా.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీ కూడా రేవంత్‌ చర్యలు సరికావని ఇన్‌డైరెక్ట్‌గా విమర్శిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

కాంగ్రెస్‌ నేతలు మాత్రం... పచ్చకామెర్ల రోగికి అన్నీ పచ్చగా కన్పించినట్లు.. గులాబీ నేతలకు పవరే కాదు... బుర్రలో చిప్‌ కూడా దొబ్బిందని ఘాటుగా స్పందిస్తున్నారు. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్నట్లుగా.. ప్రతీ దానికి రేవంత్‌కు ముడిపెట్టడం... కామన్‌ అయిపోయిందని విమర్శిస్తున్నారు. 

(vijayashanthi | telugu-news | telugu breaking news | hcu land )

Advertisment
Advertisment
Advertisment