Sajjala: లక్షమంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబు.. అలా కోట్లు కొట్టేశారు: సజ్జల

లక్షమంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబునాయుడు అంటూ తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. డిజైన్‌ టెక్‌ ద్వారా కోట్లు కొట్టేశారని టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు. మొత్తం 4 కేసులో ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. స్కామ్‌ లో ఈ ఆధారాలు దొరికాయని ప్రభుత్వం కోర్టు ముందు ఉంచిందని వ్యాఖ్యనించారు.

New Update
Sajjala: లక్షమంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబు.. అలా కోట్లు కొట్టేశారు: సజ్జల
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు(Chandrababu) అరెస్ట్ ప్రజాస్వామ్యానికే పెద్ద విఘాతం అన్నట్లు టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు మంత్రి సజ్జల(Sajjala) రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. లక్షమంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబునాయుడు అంటూ తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. స్కిల్ స్కామ్‌ లో ఆధారాలు అన్నీ పక్కాగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు సజ్జల. డిజైన్‌ టెక్‌ ద్వారా కోట్లు కొట్టేశారని టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు. మొత్తం 4 కేసుల్లో ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. స్కామ్‌ లో ఈ ఆధారాలు దొరికాయని ప్రభుత్వం కోర్టు ముందు ఉంచిందని వ్యాఖ్యనించారు. ప్రజాధనం దోపిడీకి గురైందని దర్యాప్తు చేసి సీఐడీ ఆధారాలు సమర్పించిందని పేర్కొన్నారు.

ఈ క్రమంలో టీడీపీ నారా లోకేష్(lokesh) తోపాటు తెలుగు దేశం పార్టీ శ్రేణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ ఆందోళనలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనపై టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని సజ్జల అన్నారు. టీడీపీ నేతలు అసలు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌ గురించి  ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. స్కామ్‌ పై అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? అని సజ్జల ప్రశ్నించారు. అంతే కాకుండా, లోకేష్‌ అసలు ఢిల్లీ ఎందుకు వెళ్లారు? ఢిల్లీలో ఏం చేస్తున్నారంటూ? ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ పై రాష్ట్రపతికి వినతిపత్రం ఇచ్చారని.. ఐక్యరాజ్యసమితికి ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, టీడీపీని నడిపే బాధ్యత కూడా ప్రజలదేనని ఆ పార్టీ లీడర్స్ అనడం సిగ్గుచేటని సజ్జల విమర్శించారు.

ఇన్నర్‌ రింగ్ ప్రాజెక్టులోనూ చంద్రబాబు అక్రమాలు చేశారని సజ్జల ఆరోపించారు. అన్ని కుంభకోణాల్లోనూ కిలారు రాజేశ్‌ది కీలకపాత్ర అని తెలిపారు. అమరావతి భూముల స్కామ్‌ లోనూ చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపించారు. అసైన్డ్ భూములు లాక్కొని పేదల కడుపుకొట్టారిని మండిపడ్డారు. వీటన్నింటికి చంద్రబాబే సూత్రధారని.. మిగతా వాళ్లు సహకరించారని సజ్జల ఆరోపించారు. దొంగతనం చేసి సానుభూతి కోరుకుంటున్నారని టీడీపీ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు సజ్జల.

Also Read:  ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

ఏపీ సర్కార్ మైనరిటీల కోసం కొత్త పథకం తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. చిన్నతరహా యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ సబ్సిడీపై రుణాలు పొందవచ్చు. ఈ నెల 25 నుంచి దరఖాస్తు ప్రారంభం అయ్యింది.

New Update
cm chandra babu

cm chandra babu

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మైనారిటీల అభివృద్ధే ధ్యేయంగా వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. వ్యవసాయం, రవాణా, అనుబంధ రంగాలు, సేవా, వ్యాపార, పరిశ్రమ రంగాలలో స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు అందిస్తుంది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఈ పథకం ద్వారా మైనారిటీ నిరుద్యోగ యువతకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణం ఇస్తారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా మైనారిటీ సంక్షమ శాఖ రిలీజ్ చేసింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, కార్పెంటరీ వంటి వాటిలో కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఇటీవల కూటమి ప్రభుత్వం ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.173.57 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

మైనారిటీ నిరుద్యోగ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ నిధులను అందించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఏప్రిల్ 25 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా వచ్చే నెల అంటే మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అర్హతలు

ఆసక్తిగల దరఖాస్తు దారుడు మైనారిటీ వర్గానికి (ముస్లిం, క్రైస్తవులు, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్సీలు) చెందినవాడై ఉండాలి. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయి ఉండాలి.

21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో ఏడాదికి రూ.2,00,000, గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000 ఉండాలి. 

ఎవరైతే ఈ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారో.. స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

జనరిక్ ఫార్మసీ పథకాలకు డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ అర్హత కలిగి ఉండాలి.

https://apobmms.apcfss.in/  లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. https://apobmms.apcfss.in/RegistrationForm రిజిస్ట్రేషన్ ఫామ్‌లో డీటెయిల్స్ నింపాలి.

andhra-pradesh | cm-chandra-babu | ap-govt | ap-govt-schemes

Advertisment
Advertisment
Advertisment