Yadadri : యాదాద్రి ఆలయ ఇన్‌ ఛార్జ్‌ ఈవో పై బదిలీ వేటు!

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఇన్‌ ఛార్జ్‌ ఈవో రామకృష్ణారావు పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో కొత్త గా అడిషనల్‌ కలెక్టర్‌ భాస్కర్‌ రావుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.రామకృష్ణారావు ఇంతకు ముందు ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో వివిధ హోదాల్లో పని చేశారు

New Update
Yadadri : యాదాద్రి ఆలయ ఇన్‌ ఛార్జ్‌ ఈవో పై బదిలీ వేటు!

Telangana : యాదాద్రి(Yadadri) లక్ష్మీ నరసింహ స్వామి(Lakshmi Narasimha Swamy) ఆలయ ఇన్‌ ఛార్జ్‌ ఈవో రామకృష్ణారావు(EO Ramakrishna Rao) పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో కొత్త గా అడిషనల్‌ కలెక్టర్‌ భాస్కర్‌ రావుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసలేం జరిగిందంటే... మార్చి 11న ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) తో పాటుగా రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), కొండా సురేఖ(Konda Surekha) తదితరులు ఉన్నారు.

స్వామి వారి దర్శనం , పూజా అన్ని అయిన తరువాత వేద పండితులు ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులకు వేద ఆశీర్వాచనం ఇచ్చారు. ఆ సమయంలో డిప్యూటీ సీఎం భట్టికి, మంత్రి కొండా సురేఖకు ఆలయాధికారులు చిన్న పీటలు వేశారు. ఈ విషయం గురించి రాష్ట్ర రాజకీయాలతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా పెద్ద ఎత్తున రచ్చ చేశారు.

కావాలనే భట్టిని, కొండా సురేఖను అవమానించారని పేర్కొన్నారు. ఈ అంశం బాగా సీరియస్‌ అవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆలయ ఇన్‌ఛార్జ్‌ ఈవోగా ఉన్న రామకృష్ణారావుని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ విషయం గురించి భట్టి విక్రమార్క స్పందించారు. ఇందులో ఆలయాధికారులు తప్పు లేదని, నేనే కావాలని చిన్న పీట మీద కూర్చున్నట్లు వివరించారు.

రామకృష్ణారావు ఇంతకు ముందు ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో వివిధ హోదాల్లో పని చేశారు. ఈ ఘటనతో ఆయన బదిలీ కావడంతో ఆయన స్థానంలో అడిషనల్‌ కలెక్టర్‌ భాస్కర్‌ రావుని ఆలయ ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం జీవోలు ఇచ్చింది.

Also Read : వైసీపీ ఫైనల్‌ లిస్ట్‌ డేట్‌ ఫిక్స్ చేసిన అధిష్టానం…ఎప్పుడు ..ఎక్కడ నుంచి అంటే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Weather Alert: ఏపీలో వచ్చే మూడు రోజులు పిడుగులు,మెరుపులతో వానలు..!

ఏపీలో రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.శ్రీకాకుళం,విజయనగరం,ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి.

New Update
hyd

ఏపీలో వచ్చే మూడు రోజులు పలుజిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. మంగళవారం నుంచి గురువారం వరకూ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని.. ఇలాంటి సమయాల్లో చెట్ల క్రింద నిలబడవద్దని అధికారులు తెలిపారు.

Also Read: Waqf Act Protest: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు..

ఇక మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్పారు.

Also Read: Golkonda Blue Diamond: వేలంలో ‘గోల్కొండ బ్లూ’ వజ్రం.. దీని ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడమే

మరోవైపు వచ్చే మూడు రోజులు ఏపీలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు కోస్తాంధ్ర మధ్య ప్రాంతం, యానాం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాలో వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని.. తీరం వెంబడి 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు ప్రకటించారు.

దక్షిణ కోస్తాలోనూ రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక రాయలసీమ విషయానికి వస్తే వచ్చే మూడు రోజులు మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు అకాల వర్షాలతో పలుచోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Karnataka News: చచ్చాడు వెధవ.. 5ఏళ్ల చిన్నారిని రేప్ చేసిన కామాంధుడు-గంటల వ్యవధిలో ఎన్‌కౌంటర్

Also Read:China: చైనా సంచలన నిర్ణయం.. ఆ ఎగుమతులు నిలిపివేత

srikakulam | vijayanagaram | prakasam | ap-weather | AP Weather Alert | AP Weather Latest Update | ap weather news | ap weather today | ap weather updates | ap weather update today

Advertisment
Advertisment
Advertisment