AP: వైసీపీ అభ్యర్థి బొత్స నామినేషన్.. టీడీపీ అభ్యర్థి ఎవరు? విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా.. టీడీపీ ఎందుకు పోటీలో ఉండాలనుకుంటుందో తెలియడం లేదని బొత్స అన్నారు. వైసీపీకి 530కి పైగా ఓట్ల బలం ఉందన్నారు. By Jyoshna Sappogula 12 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Botsa Satyanarayana : ఏపీలో విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. అయితే, టీడీపీ నేతలు గండి బాబ్జీ, పీలా గోవింద్, బైరా దిలీప్ టికెట్ రేసులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రేసులో బైరా దిలీప్ చక్రవర్తి ముందున్నారని.. తరువాత అనకాపల్లి లోక్సభ టికెట్ ఆశించి భంగపడిన చక్రవర్తి ఉన్నారని తెలుస్తుంది. అయితే, వీరిద్దరిలో టికెట్ ఎవరికనేది త్వరలో తెలియనుంది. Also Read: ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి బొత్స సత్యనారాయణ వైసీపీ శ్రేణులతో కలిసి నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలిపితే దుశ్చర్యకు పాల్పడినట్లేనని అన్నారు. వైసీపీకి 530కి పైగా ఓట్ల బలం ఉందని..టీడీపీకి ఉన్న బలం కేవలం 300 ఓట్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. వైసీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా.. టీడీపీ ఎందుకు పోటీలో ఉంటుందో తెలియడం లేదన్నారు. టీడీపీ బిజినెస్మెన్ను తీసుకొచ్చి పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతుందని..రాజకీయాలు అంటే వ్యాపారమా? అంటూ మాజీ మంత్రి బొత్స ప్రశ్నించారు. Also Read: పెళ్లి పందిట్లో వరుడి పై యాసిడ్ దాడి..ఎక్కడంటే! మరోవైపు రేపటితో నామినేషన్లకు గడువు ముగుస్తున్నప్పటికి టీడీపీ మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. కానీ, విశాఖ జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, నేతలతో సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థి ఎంపికపై టీడీపీ అధినేత ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. #botsa-sathyanarayana సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి