AP : ప్రతి అవినీతిలోనూ ఆమంచి సోదరులు: బాధితుడు చీరాలలో రెండు దశాబ్దాలుగా జరిగిన ప్రతి అవినీతిలో ఆమంచి సోదురుల హస్తం ఉందన్నారు కేసుల బాధితుడు నాగార్జున రెడ్డి. ప్రశ్నిస్తే బౌధిక దాడులు చేయడం, కేసులు పెట్టడం, అడ్డుతొలగించడమే వారికీ తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు కేవలం కొంతమంది సృష్టించినవేనన్నారు. By Jyoshna Sappogula 31 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Amanchi Brothers : రెండు దశాబ్దాలుగా చీరాల (Chirala) లో జరిగిన ప్రతి అవినీతిలో ఆమంచి సోదురుల హస్తం ఉందని కేసుల బాధితుడు నాగార్జున రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చీరాలలో ఆమంచి సోదరుల (ఆమంచి కృష్ణమోహన్ (Amanchi Krishna Mohan), ఆమంచి స్వాములు (Amanchi Swamulu)) ఆగడాలను అడ్డుకొనే క్రమంలో తనపై అనేక బౌదిక దాడులు చేశారని బాధితుడు నాగార్జున రెడ్డి RTVతో తన ఆవేదనను చెప్పుకున్నారు. Also Read: ఆటో డ్రైవర్ హల్చల్.. గ్యాస్ సిలెండర్తో పెట్రోల్ బంక్ తగల పెట్టేస్తానంటూ.. చీరాలలో చట్టం, ప్రభుత్వ వ్యవస్థ ఏమీ వారి ముందు పనిచేయవన్నారు. అక్రమ దందాలు చేయడం, ప్రశ్నించిన వారిపై బౌధిక దాడులు చేయడం వారి పని అని అరోపించారు. వారి అవినీతి పనులకు అడ్డొస్తే.. కేసులు పెట్టడం, అడ్డుతొలగించడమే వారికీ తెలుసన్నారు. తనపై వస్తున్న ఆరోపణలు కేవలం కొంతమంది సృష్టించినవేనని.. అందులో నిజం లేదని వ్యాఖ్యానించారు. #amanchi-krishnamohan #ongole #chirala #amanchi-swamulu సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి