National Film Awards: అరుదైన గౌరవం దక్కించుకున్న ఉప్పెన, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు

థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్టయిన ఉప్పెన సినిమా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం విభాగంలో తెలుగు లాంగ్వేజ్ నుంచి బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డ్ అందుకుంది ఈ సినిమా. ఈరోజు ప్రకటించిన 69వ జాతీయ ఫిలిం అవార్డుల్లో ఉప్పెన సినిమా ఈ ఘనత దక్కించుకుంది.

New Update
National Film Awards: అరుదైన గౌరవం దక్కించుకున్న ఉప్పెన, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు

Uppena wins National Award for Best Telugu Film in the Regional: కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలవుతాయి. ఒక్కసారిగా పరిశ్రమ మొత్తం విస్తుపోయేలా బాక్సాఫీసు దగ్గర దుమ్ములేపుతాయి.  కరోనా సమయంలో చాలా థియేటర్లు మూతపడ్డాయి. ఎక్కువ మంది ప్రేక్షకులు ఇళ్ల దగ్గరే ఉండి ఓటీటీ  లో సినిమాలు చూడటానికి అలవాటుపడ్డారు. అటువంటి సమయంలో వచ్చిన చిత్రం ఉప్పెన. బాక్సాఫీసు దగ్గర సునామీ సృష్టించింది.

థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్టయిన ఉప్పెన సినిమా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం విభాగంలో తెలుగు లాంగ్వేజ్ నుంచి బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డ్ అందుకుంది ఈ సినిమా. ఈరోజు ప్రకటించిన 69వ జాతీయ ఫిలిం అవార్డుల్లో ఉప్పెన సినిమా ఈ ఘనత దక్కించుకుంది.

తొలిచిత్రంతోనే సంచలనాలు 

మెగా కాంపౌండ్ నుంచి హీరోగా పరిచయమైన వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ఉప్పెన. సనా బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. హీరోయిన్ కృతి శెట్టి కూడా ఇదే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఇలా ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చిన ఉప్పెన సినిమా టాలీవుడ్ లో సెన్సేషనల్ విజయాన్ని సాధించింది. ఈ సినిమా దెబ్బకు, బడా సినిమాల రికార్డులు కూడా చెల్లాచెదురయ్యాయి.


అంతటి సంచలనం సృష్టించిన ఉప్పెన సినిమాకు 69వ జాతీయ ఫిలిం అవార్డుల్లో సముచిత స్థానం దక్కింది. మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

Also Read: National Film Awards: తెలుగు చిత్రాలకు అవార్డుల పంట.. RRRకు 6, పుష్పకు 2..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment