/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
accident
BIG BREAKING: నెల్లూరు జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆటోను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు వరుణ్ కుమార్ (18), నందకిషోర్ (18) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి సురేంద్ర (40) తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మనుబోలు మండలం గోట్లపాలెం సమీపంలో జరిగింది. మృతులు ఊటుకూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.