మాధవి మర్డర్ కేసులో బిగ్ అప్డేట్.. బట్టలు తీసి బాత్రూంలోకి లాక్కెళ్లి!

మాధవి మర్డర్ కేసులో బిగ్ బిగ్ అప్డేట్ వచ్చింది. ఇంట్లో దొరికిన టిష్యూ పేపర్‌‌లో మాధవి డీఎన్‌ఏ మ్యాచ్ అయింది. హత్య జరిగిన ప్రదేశంలో పోలీసులకు దొరికిన  టిష్యూను డీఎన్‌ఏ టెస్టుకు పంపగా... అవి ఆమె పిల్లల డీఎన్‌ఏతో మ్యాచ్ అయింది.

New Update
guru murthy

guru murthy Photograph: (guru murthy)

ఈ ఏడాది జనవరిలో మీర్ పేట్ లో జరిగిన మాధవి మర్డర్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో బిగ్ బిగ్ అప్డేట్ వచ్చింది. ఇంట్లో దొరికిన టిష్యూ పేపర్‌‌లో మాధవి డీఎన్‌ఏ మ్యాచ్ అయినట్లుగా పోలీసులకు తాజాగా రిపోర్టు అందింది. హత్య జరిగిన ప్రదేశంలో పోలీసులకు దొరికిన  టిష్యూను డీఎన్‌ఏ టెస్టుకు పంపగా... అవి ఆమె పిల్లల డీఎన్‌ఏతో మ్యాచ్ అయింది. దీంతో  పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. 

రిటైర్డ్ జవాన్ అయిన గురుమూర్తి తన భార్య మాధవిపై అనుమానంతో హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడకబెట్టాడు. ఎముకలు పొడి చేసి జిల్లెలగూడ చెరువులో పడేశాడు. అనంతరం తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మూడు రోజుల తరువాత గురుమూర్తినే హంతకుడని తేల్చారు.  విచారణలో గురుమూర్తి చెప్పిన నిజాలు విని పోలీసులు షాక్ అయ్యారు.  తన సర్వీస్ లో ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.  

బట్టలు తీసి డెడ్ బాడీని బాత్రూంలోకి లాక్కెళ్లి

ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న గురుమూర్తికి భార్య మాధవిని చంపేయాలని ప్లాన్ చేశాడు. స్కెచ్ లో భాగంగానే ముందుగా తన ఇద్దరు పిల్లలను బంధువుల ఇంట్లో ఉంచాడు. జనవరి 16వ తేదీన ఉదయం 8 గంటలకు నిద్రలేచి మాధవితో గొడవకు దిగాడు. గొడవ తీవ్రం కావడంతో తలను గోడకేసి బాది చంపేశాడు. మాధవి చనిపోవడంతో ఆమె డెడ్ బాడీని మాయం చేయాలని అనుకున్నాడు. ముందుగా ఆమె బట్టలు తీసి డెడ్ బాడీని బాత్రూంలోకి లాక్కెళ్లాడు. కిచెన్‌లో ఉన్న పెద్ద కత్తితో మొదట మొండెం నుంచి తలవేరు చేశాడు. ఆ తర్వాత మాధవి భుజాలను, కాళ్లను కట్ చేశాడు.

ఓ మొద్దుపై వాటిని ముక్కలు ముక్కలుగా చేసి వాటిని ఓ బకెట్ లో వేసి వాటర్ హీటర్ తో కొన్ని గంటలపాటు వేడిచేశాడు.  ఆ తరువాత వాటిని పెద్ద స్టవ్ మీద బాగా కాల్చాడు.  బాగా కాలిన తరువాత ఎముకలను రోట్లో వేసి దంచి పౌడర్ గా తయారు చేశాడు. ఇందుకు గానూ సుమారుగా 8 గంటల టైమ్ తీసుకున్నాడు. ఆ పౌడర్‌ను ఓ పెయింటింగ్ బకెట్‌లో నింపి ఆ బకెట్‌ను తీసుకెళ్లి చెరువులో కలిపేశాడు. ఇంట్లో ఏ అనావాలు దొరకకుండా డిటర్జెంట్‌తో పాటు ఫినాయిల్‌తో బాగా కడిగాడు. అనంతరం తన ఇద్దరు పిల్లల్ని తీసుకువచ్చాడని పోలీసులు తెలిపారు.  

Also Read :  ఇంతకీ ధోనీ.. విఘ్నేశ్‌తో ఏం మాట్లాడాడు?.. అసలు సంగతి ఇది!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

హైదరాబాద్‌లో షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌ అయిన నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.

author-image
By B Aravind
New Update
Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

పహల్గాం ఉగ్రదాడి ఘటనతో హై అలెర్ట్ నెలకొంది. భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయులపై  పోలీసులు నిఘా పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. వాళ్లని షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు.    

Also Read: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

Hyderabad Police Sent Notices To Pakistani Nationals

మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్‌లో 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇందులో 209 మందికి లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్నాయి. మిగతా నలుగురికి షార్ట్‌ టర్మ్‌ వీసాలు ఉన్నాయి. ఈ నలుగురి పైనే పోలీసులు నిఘా పెట్టారు. రేపటిలోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.  

ఇదిలాఉండగా.. దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలు భారత్ వదిలి ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా సైతం అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫోన్‌లు చేసి తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి తమ దేశాలకు పంపించేయాలని తెలిపారు.  దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అదే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. 

Also Read: గుజరాత్‌లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!

మరోవైపు హైదరాబాద్ పోలీసులు గురువారం ఓ పాక్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు గతంలో హైదరాబాద్కి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. దీంతో మహమ్మద్ ఫయాజ్ను గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ పాక్ యువకుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.  

Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం

Also Read :  పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్

telugu-news | rtv-news | Pahalgam attack

Advertisment
Advertisment
Advertisment