Nalgonda Accident: నల్గొండ జిల్లాలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు

TG: నల్గొండ జిల్లాలో ఒకే రోజు రెండు బస్సు ప్రమాదాలు సంభవించాయి. ప్రైవేట్ బస్సు బోల్తా పడి 30మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. శెట్టిపాలెంలో మరో ప్రైవేట్ బస్సు డీసీఎంను ఢీ కొట్టడంతో క్లినర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

New Update
Nalgonda Accident: నల్గొండ జిల్లాలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు

Nalgonda Accident: నల్గొండ జిల్లాలో ఒకరోజు రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. జగిత్యాల నుంచి దర్శి వెళ్తుండగా అద్దంకి-నార్కెట్‌పల్లి వద్ద బస్సు బోల్తా పడింది. 30 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. క్రేన్ సహాయంతో ప్రయాణికులను బయటకు తీశారు పోలీసులు. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. నల్గొండలోని శెట్టిపాలెంలో మరో బస్సు ప్రమాదానికి గురైంది. బాపట్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్లినర్ మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : నిన్న నాగార్జున.. నేడు పల్లా.. హైడ్రా యాక్షన్‌పై ఉత్కంఠ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

అమెరికా నుంచి ఫ్యామిలీ ట్రిప్.. మరో మృతుడు కుటుంబం కన్నీటి గాథ

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన బితాన్‌ మృతి చెందాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న బితాన్ ఇటీవల సొంతూరు వచ్చి వెకేషన్‌కి భార్య, కొడుకుతో వెళ్లారు. ఈ క్రమంలో ఉగ్రదాడికి బలైయ్యాడు. కుమారుడు, భార్య ప్రాణాలతో బయటపడ్డారు.

New Update
west bengal software dead

west bengal software dead

జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో దేశ వ్యాప్తంగా భయాందోళన మొదలైంది. కశ్మీర్ టూర్‌కి వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. 28 మంది పర్యాటకులను టీఆర్‌ఎఫ్‌ ఉగ్రవాదుల కాల్చి చంపారు. వీరిలో చాలా మంది మృతి చెందారు. కొత్త పెళ్లయిన వారిని కూడా దారుణం కాల్చి చంపేశారు. ఓ లెఫ్టినెంట్ నేవీ అధికారి వినయర్‌ నర్వాల్ (26) ఆరు రోజుల కిందటే పెళ్లి జరిగింది. హనీమూన్‌కి వెళ్లగా ఉగ్రవాదులు కాల్చి చంపారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

భార్య, కుమారుడిని వదిలేసి..

వీరే కాకుండా మరో ఫ్యామిలీ కూడా ఈ ఉగ్రదాడికి బలైంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బితాన్‌ అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నాడు. అక్కడ టీసీఎస్‌లో పనిచేస్తున్న బితాన్ సొంతూరు అయిన పశ్చిమ బెంగాల్‌కి ఇటీవల వచ్చారు. ఈ క్రమంలో భార్య, కొడుకుతో కలిసి వెకేషన్ కోసం కశ్మీర్ వెళ్లగా.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిలో భార్య పిల్లలను వదిలేసి.. బితాన్‌ను చంపేశారు. భర్త చనిపోవడంతో భార్య కన్నీరుమున్నీరు అవుతుంది. అతని కుటుంబ సభ్యులు కూడా రోధిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

అలాగే ఓ లెఫ్టినెంట్ నేవీ అధికారి వినయర్‌ నర్వాల్ (26) ఆరు రోజుల కిందటే పెళ్లి జరిగింది. హనీమూన్‌కి వెళ్లగా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఏప్రిల్ 16న ఆయనకు వివాహం జరిగింది. హనీమూన్‌ కోసం ఆయన తన సతీమణితో కశ్మీర్‌కు వచ్చారు. పెళ్లై కనీసం వారం రోజులు కూడా గడవకముందే వినయ్ జీవితం ఉగ్రవాదులకు బలైపోయింది.

ఇది కూడా చూడండి: J&K TerrorAttack:ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

భర్తను కోల్పోయిన ఆ నవవధువ ఆవేదన అందరినీ కన్నీ్ళ్లు పెట్టిస్తోంది. ఆమె రోదిస్తూ.. '' మాకు పెళ్లయి ఆరు రోజులే అయ్యింది. ఈ ఘటన జరిగినప్పడు మేము పానీపూరీ తింటున్నాం. ఒక్కసారిగా ఓ ఉగ్రవాది మా వద్దకు వచ్చాడు. నీ భర్త ముస్లిం కాదు కదా అని అడిగాడు. వెంటనే తన తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్లిపోయాడని'' ఆమె ఏడుస్తూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Advertisment
Advertisment
Advertisment