Hyderabad: హైదరాబాద్‌ లో షాకింగ్‌ ఘటన..భూమి పొరల్లోంచి పొగలు..కారణం ఏంటంటే!

హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద భూమిలో నుంచి పొగలు వస్తున్నాయి. ఇటీవలే అక్కడ అండర్ గ్రౌండ్‌లో విద్యుత్ శాఖ సిబ్బంది 11 కేవీ కేబుల్‌ను అమర్చినట్లుగా సమాచారం. ఆ కేబుల్‌ డ్యామేజ్‌ వల్ల ఇలా పొగలు వస్తున్నాయా అనే సందేహం వెలువడుతుంది.

New Update
Hyderabad: హైదరాబాద్‌ లో షాకింగ్‌ ఘటన..భూమి పొరల్లోంచి పొగలు..కారణం ఏంటంటే!

Hyderabad: హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద ఓ వింత ఘటన చోటుచేసుకుంది. భూమిలో నుంచి ఒక్కసారిగా పొగలు వస్తుండడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ముందు చిన్నగా వచ్చిన పొగలు..క్రమక్రమంగా పెరిగిపోయాయి. దీంతో అసలు భూమి లోపల ఏం జరుగుతోందని అందరూ అయోమయానికి గురయ్యారు.

ఈ పొగని చూసేందుకు వాహనదారులు ఎగబడటంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే, ఇటీవలే అదే ప్రాంతంలో అండర్ గ్రౌండ్‌లో విద్యుత్ శాఖ సిబ్బంది 11 కేవీ కేబుల్‌ను అమర్చినట్లుగా సమాచారం. కాగా, ఆ కేబుల్ డ్యామేజ్ అయి షాట్ సర్క్యూట్‌తో పొగలు వస్తున్నాయా లేక ఇతరకారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది.

Also Read: హీరోగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ.. మూవీ ఫస్ట్ లుక్.!

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

కల్తీ కల్లు కలకలం.. 58 మందికి తీవ్ర అస్వస్థత

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కల్తీ కల్లు తాగి మతిస్థిమితం కోల్పోవడంతో పాటు వింతగా ప్రవర్తించారు. దీంతో వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆ దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.

New Update
Kamareddy issues

Kamareddy issues Photograph: (Kamareddy issues)

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నస్రుల్లాబాద్ మండలం అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు తాగిన వారంతా ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ కల్తీ కల్లు వల్ల ఒక్కసారిగా మతిస్థిమితం కోల్పోయారు. వింతగా ప్రవర్తించడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చూడండి: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

ఇది కూడా చూడండి: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

కల్తీ కల్లు తాగిన వారి పరిస్థితి విషమం..

ఈ కల్తీ కల్లు తాగిన వారిలో కొందరి పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో వెంటనే ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణానికి వెళ్లి శాంపిల్స్ సేకరించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఆ కల్లు దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేయాలని అధికారులను సబ్ కలెక్టర్ వెల్లడించారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిని కల్లు దుకాణాలను మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కల్తీ కల్లు వల్ల ఇంకా ఎందరు ప్రాణాలు కోల్పోవాలని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే వాటిని పూర్తిగా క్లోజ్ చేయాలని, ఇలాంటి వాటికి అసలు పర్మిషన్లు ఇవ్వకూడదని స్థానికులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

Advertisment
Advertisment
Advertisment