Tiger roaming in Sangareddy:సంగారెడ్డిలో పులి సంచారం.. ఆవు మెడను కొరికి చంపిన పులి!

మొన్న వనస్థలిపురంలో పులి సంచారం కలకలం రేపితే.. ఇప్పుడు సంగారెడ్డి జిల్లా  జిన్నారం మండలం మంగపేట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పులి ‌సంచారం స్థానికులను తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే జిన్నారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో పులి సంచారం ఆనవాళ్ళు లభించాయని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో బుధవారం మేతకు వెళ్ళిన ఆవు మెడను పులి కొరికి చంపింది..

New Update
Tiger roaming in Sangareddy:సంగారెడ్డిలో పులి సంచారం.. ఆవు మెడను కొరికి చంపిన పులి!

Tiger roaming in Sangareddy: జన సంచారంలోకి మృగాలు రావడంతో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వరుసగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటుండడంతో జనం బంబేలెత్తిపోతున్నారు. మొన్న వనస్థలిపురంలో పులి సంచారం కలకలం రేపితే.. ఇప్పుడు సంగారెడ్డి జిల్లా  జిన్నారం మండలం మంగపేట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పులి ‌సంచారం స్థానికులను తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే జిన్నారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో పులి సంచారం ఆనవాళ్ళు లభించాయని స్థానికులు చెబుతున్నారు.

మూగజీవాలపై ఎటాక్ చేస్తున్న పులి..!

అయితే గత కొన్ని రోజులుగా జిన్నారం మండలంలోని పలు గ్రామాల్లో పులి సంచారిస్తుందని స్థానికులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే అనేక సందర్భాల్లో మూగజీవాలను చంపిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయని వారు చెబుతున్నారు.  ఇదిలా ఉండగా బుధవారం మేతకు వెళ్లిన ఆవుపై దాడి చేసి మెడను కొరికి చంపేసింది పులి.  దీంతో అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు.

ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు..!

అయితే ఆవు మెడను కొరికి పులి చంపడం మొదటి సారి కాదని జిన్నారం మండలం వాసులు చెబుతున్నారు. గతంలో కూడా చాలా సార్లు ఇలాగే మూగజీవాలపై పులి దాడికి దిగిందని.. మండలంలోని పలు మూగ జీవాలపై దాడికి దిగినప్పుడల్లా అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని వారు చెబుతున్నారు. ఇక ఇప్పటికే అనేక సార్లు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పులి దాడులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని, పులిని బంధించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..

జిమ్ సెల్లార్ లో రాహుల్ మర్డర్..మామూలుగా ట్విస్ట్ లు లేవుగా.. ప్రేమ వ్యవహారమే!! https://rtvlive.com/rahuls-murder-in-the-gym-cellar-no-twists-as-usual-its-a-love-affair/

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment