AP: వాగు ఉధృతికి కొట్టుకుపోయిన కారు.. కేకలు వినపడటంతో..!

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు ఉగ్రరూపం దాల్చుతోన్నాయి. వాగు దాటే క్రమంలో కారు కొట్టుకుపోయింది. కారులో ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్టు సమాచారం.

New Update
AP: వాగు ఉధృతికి కొట్టుకుపోయిన కారు.. కేకలు వినపడటంతో..!

Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది.  భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు ఉగ్రరూపం దాల్చుతోన్నాయి. వేలేరుపాడు మండలం కోయమాధారం నుంచి అల్లూరి నగర మధ్యలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

Also read: కుటుంబంలో ఘోర విషాదం.. తల్లిదండ్రులకు తోడుగా వెళ్లిన అన్నా, తమ్ముడు మృతి..!

వాగు దాటే క్రమంలో ప్రవాహధాటికి కారు కొట్టుకుపోయింది. కారులో ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. రాజమండ్రి నుంచి రుద్రంకోట వస్తుండగా ప్రమాదం జరిగింది. కారులో కొట్టుకుపోయిన వారి కేకలు వినపడటంతో గ్రామస్తులు వారిని కాపాడే ప్రయత్నం చేస్తోన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు