AP: ఏపీలో మరోసారి ఎండ తీవ్రత.. రికార్డుస్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు..!

ఏపీలో వాతావరణం మారిపోయింది. మొన్నటి వరకు వర్షాలు పడగా.. సోమవారం నుంచి మళ్లీ ఎండలు, వేడిగాలుల తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది.

New Update
AP:  ఏపీలో మరోసారి ఎండ తీవ్రత.. రికార్డుస్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు..!

AP Temperatures:  ఏపీలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. మొన్నటి వరకు భారీ వర్షాలు పడగా నిన్నటి నుంచి మళ్లీ ఎండల తీవ్రత మొదలైంది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఎండ ప్రభావం చూపుతుందంటున్నారు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్.

Also Read: రెమాల్ విధ్వంసం.. మిజోరం, అస్సాంపై ప్రతాపం చూపిస్తున్న తుపాను..!

తిరుపతి జిల్లా సత్యవేడులో 41.9 డిగ్రీలు, నెల్లూరు జిల్లా మనుబోలులో 41.5 డిగ్రీలు, బాపట్ల జిల్లా వేమూరు, కృష్ణా జిల్లా పెడనలో 40.9 అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: తల్లి పాలను విక్రయిస్తే అంతే.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వార్నింగ్..!

మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్‌ ఆదివారం అర్ధరాత్రి తర్వాత తీరం దాటింది. ఈ క్రమంలో పలు ప్రాంతాలవైపు తుఫాన్‌ దిశగా పొడి గాలులు వీస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌ల వైపు తీవ్రమైన వేడిగాలులు, ఎండ తీవ్రత, రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణశాఖ తెలిపింది. రానున్న మూడు రోజులు ఎండ తీవ్రత కొనసాగుతుందని.. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime News : అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు...లక్షల విలువచేసే బంగారంతో…

ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు సొంత అక్క ఆర్థికంగా బాగుండంతో దుర్భిద్ధి పుట్టింది. దాంతో అక్క ఇంటికే కన్నం వేసిందో చెల్లెలు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చోరీ కేసును ఛేదించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది సంఘటన.

New Update
Nidadavole Police Station

Nidadavole Police Station

AP Crime News : ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు సొంత అక్క ఆర్థికంగా బాగుండంతో దుర్భిద్ధి పుట్టింది. దాంతో అక్క ఇంటికే కన్నం వేసిందో చెల్లెలు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చోరీ కేసును ఛేదించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది సంఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిడదవోలులోని ఎంవీనగర్ దానమ్మ గుడివద్ద గల లలితదేవి అనే మహిళ ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ.12,50,000 విలువ చేసే బంగారంతో పాటు రూ.10000 నగదు చోరికి గురైంది. లలితదేవి బయటకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడం, ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా ఉండటంతో పాటు నగలు చోరీ జరిగినట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి క్లూస్ సేకరించారు.

Also Read: 'ప్రభాస్'ని పక్కన పెట్టి అలియా భట్ తో నాగ్ అశ్విన్ మూవీ..!

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

కాగా పోలీసులు అన్ని రకాలుగా విచారించి చోరి చేసింది లలితాదేవి చెల్లెలే అని నిర్ధారించారు. ఇటీవల నిడదవోలులోని అక్క ఇంటికి వచ్చిన చెల్లెలు లక్ష్మీ శైలజ. అప్పటికే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న శైలజ అక్క ఇంట్లో డబ్బు, బంగారం చూడగానే దుర్భిద్ది పుట్టింది. దీంతో మరో రోజు పగడ్భందిగా ప్లాన్ చేసింది. చేసి అక్క బావ ఇంట్లో లేనప్పుడు చూసి మరో ఇద్దరు సాయంతో అక్క ఇంట్లో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడింది. అక్క ఇంటికి రాగానే ఇల్లంతా చిందర వందరంగా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా చెల్లెలును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment