సిగ్గు, శరం, లజ్జ, మానం ఉంటే.. మరోసారి రెచ్చిపోయిన కౌశిక్ రెడ్డి! సిగ్గు, శరం, లజ్జ, మానం ఉంటే దానం నాగేందర్ ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఆంధ్ర సెటిలర్స్ పై తనకు గౌరవం ఉందన్నారు. గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలు కేవలం ఆయనను ఉద్దేశించినవేనని స్పష్టం చేశారు. By Nikhil 13 Sep 2024 | నవీకరించబడింది పై 13 Sep 2024 15:19 IST in తెలంగాణ రాజకీయాలు New Update షేర్ చేయండి Koushik Reddy: ఆంధ్ర సెటిలర్స్ పై తనకు గౌరవం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తన వ్యాఖ్యలు కేవలం గాంధీని ఉద్ధేశించనవేనని స్పష్టం చేశారు. ఇప్పుడు జరుగుతున్నది గాంధీ చెప్పినట్లు కౌశిక్ రెడ్డికి, ఆయనకు మధ్య జరుగుతున్న వ్యక్తిగత యుద్ధమేనని అన్నారు. ఇక్కడ నివసిస్తున్న ఆంధ్ర సెటిలర్స్ కు కాలులో ముల్లు గుచ్చుకున్న పంటితో తీస్తా అని గతంలో కేసీఆర్ చెప్పారన్నారు. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ పదేళ్ల పాలన సాగిందన్నారు. దానంకు గోకుడెక్కువ.. తనకు దూకుడు ఎక్కువ ఉంటే దానం నాగేందర్ కు గోకుడు ఎక్కువ ఉందని కామెంట్స్ చేశారు. దానం నాగేందర్ కు సిగ్గు, శరం, లజ్జ, మానం ఉంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. హైడ్రా వెనక ఉన్నదే చంద్రబాబు అని కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడి రేవంత్ రెడ్డి ఇక్కడి నుండి పెట్టుబడులను అమరావతికి తీసుకుపోతున్నాడని ఆరోపించారు. ఇప్పటికే హైడ్రా, బైడ్రా అంటూ హైదరాబాద్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్లో పెట్టుబడి పెట్టాలి అంటే భయపడే పరిస్థితికి తీసుకు వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అంత ఒక పెద్ద కుట్ర అని అన్నారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ డెవలప్ కాకుండా చేస్తున్నాడని ఆరోపించారు. Also Read: బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. పోలీసులకు రేవంత్ సంచలన ఆదేశాలు #Arekapudi Gandhi #mla-koushik-reddy #telangana-politics సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి