/rtv/media/media_files/2024/10/22/bnNWB0J17DJgUDVzPImu.jpg)
కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. లేక పోయినా.. రాష్ట్ర ఇన్ఛార్జ్ ల హవా మాత్రం జోరుగానే ఉంటుంది. వీరికి రాష్ట్రానికి వచ్చినప్పుడు స్వాగతం, తిరిగి వెళ్లేటప్పుడు వీడ్కోలు ఘనంగా లభిస్తుంది. టికెట్లు, పదవులు ఆశించేవారు వీరిని ప్రసన్నం చేసుకోవడానికి వీరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నా కొద్దీ హవా అంతకంతకూ పెరుగుతూ ఉంటుందన్న టాక్ ఉంది. టికేట్ల కేటాయింపులో వీరు కీలకంగా ఉండడమే ఇందుకు కారణం. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, మాణిక్కం ఠాగూర్, మాణిరావు ఠాక్రే తదితరులు కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రభావం చూపారు. ఇందులో మాణిక్కం ఠాగూర్ పై సొంత పార్టీ నేతలే తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రేవంత్ తో సన్నిహిత్యంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఆయనను తప్పించి మాణిక్ రావు ఠాక్రేను నియమించింది హైకమాండ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చిన అనంతరం ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత దీపదాస్ మున్షికి ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించింది హైకమాండ్.
ఇది కూడా చదవండి: మూసీ నిర్వాసితులకు సర్కార్ బంపర్ ఆఫర్..200 గజాల స్థలం, రూ.30 లక్షలు..!
అయితే.. తెలంగాణలోనే తిష్ట వేసిన మున్షి అధికార దర్వినియోగం చేస్తోందంటూ మీడియాలో కథనాలు రావడం సంచలనం సృష్టిస్తోంది. ఆమె సమంతర పాలన నడుపుతున్నారంటూ ఆ వార్త కథనాలు పేర్కొనడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె “Viceroy of Telangana” ఆమెకు నిక్ నేమ్ ఉందని ఆరోపణలు చేసింది ఆ కథనం. మున్షి రాష్ట్రంలోనే స్థిరపడి.. తనకంటూ ఓ చిన్న సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారని పేర్కొంది. ఈ విషయమై పార్టీ పెద్దలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించింది.
Is there a parallel govt being run in Telangana??
— Naveena (@TheNaveena) October 22, 2024
Within Congress circles, AICC Incharge has allegedly earned the nickname “Viceroy of Telangana” for the way she’s settled into state, as if deputed from Delhi to run a mini-empire.
Top Sources allege that it is almost like a…
ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం?
ఆమె లక్షల రూపాయాలు అద్దె కలిగిన ఖరీదైన భవనాల్లో ఉంటున్నారని.. ఇంకా ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారని తెలిపింది. అంతటితో ఆగకుండా అధికారిక సమీక్షల్లో పాల్గొంటూ ఆదేశాలను ఇస్తున్నారని వెల్లడించింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతిపక్ష నేతలు ఈ కథనాన్ని అస్త్రంగా చేసుకుని వైరల్ చేస్తున్నారు. అయితే.. ఈ కథనాలపై హస్తం నేతలు ఎలా రియాక్ట్ అవుతారు? హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అన్న అంశం పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్కంఠగా మారింది.
KTR : మోసగాడిని నమ్మినందుకు తెలంగాణ ఆగం అయింది. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు
BRS meeting
KTR : తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు..రేవంత్ రెడ్డి చెప్పిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసంబద్ధ హామీల వలన ప్రజల జీవితాలు సంక్షోభంలో పడినట్టు పేర్కొన్నారు. ‘‘ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు, కానీ పదేపదే మోసపోతే అది మన తప్పవుతుంది. కాబట్టి ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ను తిప్పికొట్టాలి’’ అని ప్రజలను హెచ్చరించారు.
ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!
కాంగ్రెస్ ను తిరస్కరించండి
‘ఒకే తప్పును మళ్లీ చేయొద్దు. GHMCతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను తిరస్కరించండి’’ అంటూ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం దారుణంగా వెనుకబడుతున్నా, ఒక్క రేవంత్ రెడ్డీయే ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘‘రేవంత్ పాలన వలన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమే’’ అని అన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తారని కేటీఆర్ ప్రశంసించారు. ‘‘డంపింగ్ యార్డ్ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంచి నాయకుడిని గెలిపిస్తే, మంచి మార్పు సాధ్యమవుతుందని ఆయన నిరూపించారన్నారు.
Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..
నలుగురికి భరోసానిచ్చేది బీఆర్ఎస్
ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా ఈసారి ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆత్మ, తెలంగాణ స్వభిమానం కాపాడాలంటే, భరోసా నలుగురికీ కలిగించగల పార్టీ ఒక్కటే ఉంది అది భారత రాష్ట్ర సమితి అని పేర్కొన్నారు.సిల్వర్ జూబ్లీ ఉత్సవాల విజయవంతానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘‘ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఒక పార్టీగా 25 సంవత్సరాల ప్రయాణం ఎలాంటి మైలురాయో ప్రతి కార్యకర్తకు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రెండవ ఘనత సాధించిన పార్టీగా మనకు గర్వం’’ అని కేటీఆర్ తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.
Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్
DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచిన ముంబయ్
DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్
Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య
DC vs MI: ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యం.. మంబయి స్కోర్ ఎంతంటే ?
AB Venkateswara Rao : జగన్ అంటే హత్యలు, అవినీతి, అరాచకం...మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు